- పోరుకు సై అంటూ రంగంలోకి దిగిన బండి సంజయ్ మాయ చేయనున్నారా?
- జానా రెడ్డికి జనాలు జై కొట్టేనా?
- నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో విజయం వారిదేనా?
- కాకా పుట్టిస్తున్న నాగార్జున సాగర్ రాజకీయం !
తెలంగాణలో మరో ఎన్నికల పోరుతో రాష్ట్ర రాజకీయం హీటెక్కుతోంది. ఇటీవలే పట్టభద్రుల ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థాన ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 23న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. మార్చి 30 వరకు నామినేషన్లు స్వీకరణ.. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుందని పేర్కింది. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. 17న ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించి, మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు వెల్లడించింది.
నాగార్జున సాగర్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార టీఆర్ఎస్ నేత నోముల నర్సింహయ్య అకాల మరణంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు సాగర ఉప ఎన్నిక కోసం ఎదుచూస్తూ.. రాజకీయాలను నడుపుతున్నాయి. తాజాగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పటి నుంచే ప్రచారాన్ని మరింతగా వేగవంతం చేస్తున్నాయి. ఈ ఉప ఎన్నిక పోరులో ఎలాగైన గెలిచితీరాలని అధికార టీఆర్ ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర స్థాయిలో కసరత్తులు మొదలు పెట్టాయి.

సాగర సమరంలో గులాబీ బాసు !
రాష్ర్టంలో కమళం పార్టీ దూకుడు పెంచుతూ ముందుకు సాగుతుండటం.. దానిని ప్రజల నుంచి సైతం మద్దతు పెరుగుతుండటం అధికార టీఆర్ఎస్ ను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎందుకంటే ఆ మధ్య జరిగిన దుబ్బాక ఎన్నికలో విజయం మాదే అనే గులాబీ ధీమాపై కమళం దెబ్బకొట్టింది. ఇటీవల జరిగిన హైదరబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కళ్లేం వేసే విధంగా స్థానాల గెలుచుకుంది. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సాగర్ ఉప ఎన్నికను అధికార పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోంటోందని తెలుస్తోంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోకపోతే పార్టీపై ప్రభావం పడుతుందని గులాబీ పార్టీ భావిస్తున్నట్టుంది. అందుకే ఇక్కడ విజయభావుట ఎగురవేసి బీజేపీని సైలెంట్ చేయాలని చూస్తున్నది. దీని కోసం ఏకంగా ఈ సారి గులాబీ బాసు రంగంలో దిగినట్టు సమాచారం. సీఎం కేసీఆరే స్వయంగా అక్కడి పరిస్థితులను అంచనా వేస్తూ… ప్రణాళికలు రచిస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎదెమైనప్పటికీ… టీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం కావడంతో వారి గెలుపుకు అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సాగర పోరుకు సై అంటున్న బండి సంజయ్
బండి సంజయ్ నేతృత్వంలోని రాష్ట్ర బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. నా దారి రహదారి.. లేకుంటే ఎదురు దాడి అనే స్పీడ్ లో గత కొంత కాలంగా రాష్ట్ర కమళం ప్రజల్లోకి వెల్లడానికి ఇరత పార్టీలపై ఆరోపణలు, విమర్శల పదును పెంచి ముందుకు సాగుతోంది. మరీ ముఖ్యంగా హిందుత్వం అనే సెంటిమెంట్ తో ప్రజల్లో మంచి స్పందనను రాబట్టుకుంటోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇచ్చిన గెలుపు బూస్ట్ తో.. సాగర సమరంలో విజయం సాధించాలని ఉవ్విల్లురుతోంది.
దీని కోసం రాష్ట్ర బీజేపీ చీఫ్ సారగ సమరానికి సై అంటూ రంగంలోకి దిగాడు. బీజేపీ పెద్దగా క్యాడర్ లేని ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. దీని కోసం బండి సంజయ్ పాద యాత్రను చేయడానికి సిద్ధమవుతున్నాడని సమాచారం.

తన పాదయాత్రతో అక్కడ బీజేపీ బలం పుంజుకుంటుందనీ, అలాగే, ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉంటుందని బీజేపీ ప్లాన్ వేసింది. ఇదిలా ఉండగా.. సాగర్ లో అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే విషయంలో కూడా బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న నివేదితారెడ్డి, అంజయ్య యాదవ్లకు పార్టీ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది. మరో వైపు ఇరత పార్టీలకు చెందిన నల్లగొండ నేతలతో బీజేపీ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా వారిని పార్టీలోకి చేర్చుకుని లబ్ది పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఇదే గనక జరిగి.. బండి సంజయ్ తనదైన స్టైల్ దూసుకుపోతే.. కమళం జయకేతనం ఎగురవేసిన ఆశ్చర్య పోనక్కర్లేదు. కానీ ఇది అంత సులువుగా అయితే దక్కదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ కంచుకోట.. జానారెడ్డి బీటలు పూడ్చేనా?

ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది. అయితే, ఇదివరకు జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ కంచుకోట బీటలు వారించింది అధికార టీఆర్ ఎస్ పార్టీ. 2018లో జరిగిన ఈ ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జానారెడ్డిపై గులాబీ నేత నోముల నర్సింహ్మయ్య తిరుగులేని విజయం సాధించాడు. కానీ ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీని కోసం ఇప్పటివరకు ఉన్న అంతర్గత విభేధాలను పక్కనబెట్టిమరి ఉమ్మడి నల్లగొండ కాంగ్రెస్ నేతలు సాగర్ విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జానా రెడ్డిన తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. ఆయనకు అక్కడ మంచి గుర్తింపు ఉండటం, కాంగ్రెస్ నేతలందరూ విభేధాలు పక్కనబెట్టి మళ్లీ సాగర్ గెలుపుతో కాంగ్రెస్ కు ఫూర్వ వైభవం తీసుకురావాలనే ప్రయత్నాలు వీరికి అనుకూలించే అంశమని చెప్పాలి.
అయితే, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను సందిగ్దంలో పడేశాయి. ఎందుకంటే సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హస్తానికి గుడ్ బై చెప్పారు. అదే బాటలో మరికొంత మంది ఉన్నారనే దానికి అనుగుణంగా కొమటి రెడ్డి వ్యాఖ్యలు రాజకీయం ప్రకపంనలు సృష్టిస్తున్నాయి. నాగార్జున సాగర్ లో పోటీ చేయమని పలువురు బీజేపీ నేతల తనను సంప్రదించారనీ, కొన్ని రోజులుగా తమ మధ్య దీని గురించి చర్చలు జరుపుతున్నామంటూ బాంబు పెల్చారు. ఇది కాంగ్రెస్, టీఆర్ ఎస్ లకు చెక్ పెట్టే ఉద్దేశంలో బీజేపీ ప్లాన్ అని తెలుస్తోంది. ఈ విషయం కాస్తా కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారే అవకాశమైతే ఉంది.

పవన్ ఈ చర్యలు బీజేపీకీ ఝలక్ ఇచ్చేందుకేనా?
జనసేన తెలంగాణలో విస్తరేంచే కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. దీనిలో భాగంగా తాజాగా నల్లగొండ జిల్లాకు సంబంధించి జనసేన జిల్లా కమిటీని ప్రకటించింది. అయితే, తెలంగాణ బీజేపీ తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదనీ, గౌరవం లేనిచోట కలిసి ఉండాల్సిన అవసరం లేదంటూ పవన్ ఇటీవల పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంబంధించి అధికార పార్టీ అభ్యర్థి సురభి వాణీకి అనూహ్యంగా మద్దతు ప్రకటించారు. దీంతో రాష్ట్ర బీజేపీ పవన్ పై తీవ్రంగానే స్పందించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీతో తెగదెంపులు చేసుకునీ, సాగర్ పోరుపై పోకస్ చేసినట్టు తెలుస్తోంది. అయితే, బీజేపీ, జనసేనల మరో రాజకీయ ఎత్తుగడ అని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఈ త్రిముఖ పోరులో విజయం ఎవరిని వరించునో.. ఓటర్లు ఎవరికి జై కోట్టునో !
పంచాయతీ కార్యదర్శులంటే ఎందుకంత చులకనా ?
రూ.2,30,825.96 కోట్లతో తెలంగాణ బడ్జెట్
ఎమ్మెల్సీ పోరు.. ‘బ్యాలెట్ బాక్సులో గోల్ మాల్’ జరిగిందా?
ఎంపీ అరవింద్ కు కేంద్రంతో కొట్లాడే దమ్ముందా?