- ఉద్యోగులపై ప్రేమను చాటుకున్న సీఎం కేసీఆర్
- 30 శాతం ఫిట్మెంట్ ప్రకటన
సోమవారం శాసనసభలో పీఆర్సీ పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు మస్తు ఖుషీ అయ్యిండ్రు. సీఎం కేసీఆర్ ఎంతో గొప్పవాడంటూ.. పలు చోట్ల ఆయన ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. అయితే ఈ ప్రకటన చేసే సమయంలో కూడా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఎంతగానో ప్రశంసించారు. స్వరాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో వీరి పాత్ర ఎంతగానో ఉందని తెలిపారు.
పీఆర్ సీపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి, ఆయన ఉద్యోగులపై చూపిన అభిమానానికి ఎంతో మంది సంతోషంతో పొంగిపోయారు. కేసీఆర్ ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారంటూ.. పేర్కొన్నారు. ఆయన తీసుకున్న పీఆర్సీ ప్రకటన తమ బతుకుల్లో ఎంతో మార్పు తెస్తుందని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ప్రభు త్వ ఉద్యోగులతోపాటు ఇతర అన్నిరకాల ఉద్యోగులు, పెన్షనర్లును కలిపి 9,17,797 మంది తెలంగాణ తొలి పీఆర్సీ ద్వారా లబ్ధి పొందనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన వలన దేశంలో అత్యధిక వేతనాలు అందుకుంటున్న ప్రభుత్వోద్యోగులు మనదగ్గరే ఉంటారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
” సీఎం సార్ కు రుణపడి ఉంటాం..”

“పీఆర్సీ పై సీఎం సార్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. హోం గార్డు జీవితం అంటే చాలీచాలని బతుకులు అని అందరికి తెలిసిందే. కానీ సీఎం సార్ ఇప్పుడు మా బతుకుల్లో వెలుగులు నింపిండు. మేము గర్వంతో తలెత్తుకునేలా పీఆర్సీ ఇచ్చిండు. ఆయనకు మా కుటుంబాలు రుణపడి ఉంటాయి. సీఎం సార్ ఇచ్చిన మాటకు కట్టుబడి నిలిచిండు. ఈ విషయంలో ఆయన చరిత్రలో నిలిచిపోతారు.” – జక్కుల శేఖర్, హోంగార్డ్, చైతన్యపురి పీఎస్
దర్వాజ.కామ్ లో రిపోర్టర్ గా జాయిన్ కావాలనుకుంటున్నారా ? అయితే వెంటనే మీ బయోడేటా ఫాంను మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడీ: darvaaja@gmail.com లేకపోతే మాకు కాల్ చేయండి. మా నెంబర్:7780448771
మీ అభిప్రాయాలను ప్రపంచంతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. నలుగురిని ఆలోచింపజేసే ఏ ఆర్టికల్ ను అయినా మా వెబ్సైట్ లో పబ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టికల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..
పంచాయతీ కార్యదర్శులంటే ఎందుకంత చులకనా ?
గెలిచినా భయపడుతున్న సారు ‘కారు’