- అంకమరావుకు నివాళులు అర్పించిన కొత్తగూడెం సర్పంచ్ మల్ రెడ్డి, అంజిరెడ్డి
దర్వాజ-రంగారెడ్డి
కందుకూరు మండల రిపోర్టర్ సాంబశివుడు తండ్రి అంకమరావు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రరెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మంత్రితో పాటు జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ ఛైర్ పర్సన్ తదితర నేతలు ఉన్నారు.

అలాగే, పలువురు బీజేపీ నేతలు సైతం అంకమరావుకు నివాలులు అర్పించారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరిలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్ ఉన్నారు. అలాగే, కొత్తగూడెం సర్పంచ్ మల్ రెడ్డి, అంజిరెడ్డి తదితరులు అంకమరావుకు నివాళులు అర్పిస్తూ.. బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. ఓదార్చారు.