Breaking
Sat. Jun 28th, 2025

దేశంలో క‌రోనా సునామీ

Coronavirus India Live Updates 2 lakh new corona cases
Coronavirus India Live Updates 2 lakh new corona cases
  • ఒక్క‌రోజే రెండు ల‌క్ష‌ల‌కు పైగా కొత్త కేసులు
  • వేయికి పైగా మ‌ర‌ణాలు
  • ప్ర‌మాదం ముంచుకొస్తున్న‌ద‌ని నిపుణు‌ల ఆందోళ‌న

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం దాల్చింది. తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ.. క‌రోనా సునామీ సృష్టిస్తోంది. దీంతో దేశంలో నిత్యం ల‌క్ష‌కు పైగా న‌మోద‌వుతున్న కేసులు.. తాజాగా ఒక్క‌రోజే రెండు ల‌క్ష‌ల మంది కొత్త‌గా క‌రోనా సోక‌డం వైర‌స్ వ్యాప్తికి అద్దం ప‌డుతోంది.

గురువారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. దేశంలో గ‌త 24 గంటల్లో కొత్త‌గా 2,00,739 కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో ఒక్క‌రోజే ఈ స్థాయిలో కేసులు న‌మోదుకావ‌డం ఇదే మొద‌టి సారి. మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతూనే ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

గ‌త 24 గంటల వ్య‌వ‌ధిలో వైర‌స్‌తో పోరాడుతూ 1,037 మంది మ‌ర‌ణించారు. దీంతో మొత్త పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,74,564 చేరింది. మ‌ర‌ణాల సంఖ్య 1,73,123 కు పెరిగింది. యాక్టివ్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం దేశంలో 14,71,877 క్రీయాశీల కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,24,29,564 మంది కోలుకున్నారు.

అత్య‌ధికం మ‌హారాష్ట్రలోనే..

దేశంలో న‌మోద‌వుతున్న కేసుల్లో అత్య‌ధికం మ‌హారాష్ట్రలోనే న‌మోద‌వుతున్నాయి. తాజాగా న‌మోదైన కొత్త కేసుల్లో 58,952 మహారాష్ట్రలో, ఢిల్లీలో 17,282 కేసులు వెలుగుచూశాయి. మొత్తంగా అత్య‌ధిక కేసులు న‌మోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్టలో 35.78 లక్షలు, కేరళలో 11.72 లక్షలు, క‌ర్నాట‌ 10.94 లక్షలు, తమిళనాడులో 9.40 లక్షలు, ఆంధ్రప్రదేశ్ లో 9.28 లక్షల కేసుల‌తో టాప్-5లో ఉన్నాయి.

ముమ్మ‌రంగా వ్యాక్సినేష‌న్‌.. క‌రోనా ప‌రీక్ష‌లు

క‌రోనా కేసులు రికార్డు స్థాయిలో పెర‌డ‌గం, వ్యాక్సిన్ల కొరత వేధించ‌డం ప‌రిస్థితుల‌ను మ‌రింత ఆందోళ‌నక‌రంగా మారుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వాలు క‌రోనా ప‌రీక్ష‌లు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌నున ముమ్మ‌రం చేశారు. దేశంలో ఇప్ప‌టివ‌రకు మొత్తం 26,20,03,415 ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి వెల్ల‌డించింది. బుధ‌వారం ఒక్క‌రోజే 13,84,549 శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్టు ఐసీఎంఆర్ తెలిపింది. కాగా, దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 11.4 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందించారు. బుధ‌ర‌వారం ఒక్క‌రోజే 33 ల‌క్ష‌ల‌కు పైగా వ్యాక్సిన్లు వేశారు.

ఆయనొక అభ్యుదయ అక్షరజ్యోతి

భ‌విష్య‌త్తుపై స‌న్న‌గిల్లిన విశ్వాసం !

లింగ‌ స‌మాన‌త్వం ఇప్ప‌ట్లో జ‌ర‌గ‌న‌ట్టే !

నీటి బొట్టు.. బతుకు మెట్టు !

తెలంగాణ గడ్డ రుణం తీర్చుకుంటా !

Related Post