Breaking
Sat. Jun 28th, 2025

18 ఏండ్లు నిండిన వారంద‌రికీ వ్యాక్సిన్

vaccine for all
vaccine for all
  • కీల‌క నిర్ణ‌యం తీసుకున్న కేంద్ర ప్ర‌భుత్వం
  • మే 1 నుంచి అమ‌లు

ద‌ర్వాజ‌-జాతీయం: భార‌త్ లో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న బీభ‌త్సం మ‌మూలుగా లేదు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రంలో క‌రాళ నృత్యం చేస్తుంది. అనేక మందిని బలి తీసుకుంటూ.. మ‌ర‌ణ మృదంగాన్ని వాయిస్తోంది. గ‌త కొన్ని రోజులుగా దేశంలో రోజుకు రెండు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.. భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్లిష్ట త‌రుణంలో కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

దేశంలో న‌మోదైన కేసుల‌ను ప‌రిశీలిస్తే.. యువ‌త‌నే ఎక్కువ‌ మ‌హామ్మారి బారిన ప‌డుతున్నారు. దీంతో కేంద్రం .. 18 ఏండ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రికి వ్యాక్సిన్ ఇవ్వాల‌ని నిర్ణ‌యింది. వీరికి మే 1 నుండి వాక్సిన్ ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఆదేశాల మేరకు దేశంలో యువతకు ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నారు.

మే 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా 3వ విడతలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు కేంద్రం పేర్కొంది. వ్యాక్సిన్ కోసం అందరూ కొవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.

Related Post