- ఎయిమ్స్కు తరలింపు
దర్వాజ-జాతీయం: కరోనా ఎవరిని వదలడం లేదు. ఇప్పటికి అనేక మంది ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారిన పడగా.. అటు, భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
ఆయన కొంత అస్వస్తతకు గురి కావడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో మన్మోహన్ సింగ్ కు పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయనను చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. విషయం తెలుసుకున్న పలు పార్టీలకు చెందిన నేతలు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు తెలిపారు.