Breaking
Sat. Jun 28th, 2025

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ

Chief Justice of India Justice NV Ramana
Chief Justice of India Justice NV Ramana

దర్వజ-న్యూఢిల్లీ
సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ నియ‌మితుల‌య్యారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తాజాగా ప్రమాణ స్వీకారం చేయించారు. శ‌నివారం రాష్ట్రపతి భవన్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మోడీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు ప‌లువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి అతిథులు త‌క్కువ మంది హాజరయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. కాగా, 2022, ఆగస్టు 26 వరకు (16 నెలల పాటు) సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సీజేఐగా నియమితులైన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నిలిచారు. 1966-67 మ‌ధ్య కాలంలో జస్టిస్ కోకా సుబ్బారావు సీజేఐగా పనిచేశారు.

https://darvaaja.com/justice-nv-ramana-takes-oath-as-48th-chief-justice-of-india/

Related Post