- హైదరాబాద్ జూపార్క్ లో 8 సింహాలకు సోకిన సార్స్ కోవీ-2
దర్వాజ-హైదరాబాద్
హైదరాబాదులోని నెహ్రూ జూ పార్కులో ఏకంగా ఎనిమిది సింహాలకు కరోనా సోకినట్టు వచ్చిన వార్తలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే జూ పార్కులోని ఎనిమిది సింహాల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వాటి శాంపిళ్లను సేకరించి, తార్నాకలోని సీసీఎంబీకి పరీక్షల నిమిత్తం పంపారు.
తాజాగా దానికి సంబంధించిన రిపోర్టులు వచ్చాయి. ఆ ఎనిమిది సింహాలకు సోకింది కరోనా వైరస్ కాదనీ, దానిని సార్స్ కోవీ-2గా వ్యవహరిస్తారని పరిశోధకులు తెలిపారు. ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకే అవకాశంలేదన్నారు. అలాగే, ఈ వైరస్ ప్రమాదం సైతం పెద్దగా ఉండదని తెలిపారు.

ఇదిలా ఉండగా, జూపార్కులోని ఎనిమిది సింహాలు సార్స్ కోవీ-2 బారినపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ఎనిమిది సింహాలకు చికిత్స అందిస్తున్నారు. మిగతా జంతువులను వాటికి దూరంగా ఐసోలేషన్లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికైతే జూలోని సింహాలన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.