- సిద్దిపేట కలెక్టర్ పి వెంకట్రామి రెడ్డి
దర్వాజ-సిద్ధిపేట
కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ క్షేత్రస్థాయి అమలుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి ఆధికారులను ఆదేశించారు. లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు.
తాజాగా జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి లాక్ డౌన్ అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ సహా సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ రెవెన్యూ డివిజన్ అధికారులతో చర్చించారు. ఈ క్రమంలోనే రెవెన్యూ, పోలీస్ అధికారులు రెవెన్యూ డివిజన్, మండలాలలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి లాక్ డౌన్ను పటిష్టంగా అమలుచేయాలని ఆదేశించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.