- దేశంలో మరోసారి చమురు ధరల పెంపు
ఇప్పటికే దేశంలో కరోనా మహమ్మారి సంక్షోభంతో జనజీవవనం అతాలాకుతలమైంది. ఆర్థికంగా ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో నిత్యావసరాల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంధన ధరలైతే గత నెలలో ఏకంగా 16 సార్లు పెరగడంతో లీటరు పెట్రోల్ ధర సెంచరీ దాటింది. తాజాగా మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. దీంతో మే 3 నుంచి ఇప్పటివరకు 17 సార్లు చమురు ధరలు పెరగడంతో దేశంలోని చాలా చోట్ల లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటింది.
మంగళవారం లీటరు పెట్రోల్పై 26 పైసలు, డిజీల్పై 23 పైసలను చమురు కంపెనీలు పెంచాయి. తాజాగా పెరిగిన ధరలతో రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.49, లీటర్ డీజిల్ రూ.85.38కు పెరిగాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.101కి చేరువైంది. మరో వైపు రాజస్థాన్లో శ్రీగంగానగర్ జిల్లాలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.105.52కు చేరగా, డీజిల్ ధర లీటరుకు ధర రూ.98.32కు పెరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలోని చాలా చోట్ల లీటరు పెట్రోల్ ధర సెంచరీ దాటింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్ ధరలు రూ.100కు చేరువయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.98.20, డీజిల్ రూ.93.08కు చేరుకుంది.
దేశంలోనే వివిధ నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి..
ముంబయిలో పెట్రోల్ రూ.100.47, డీజిల్ రూ.92.69
చెన్నైలో పెట్రోల్ రూ.95.99, డీజిల్ రూ.90.12
కోల్కతాలో పెట్రోల్ రూ.94.50, డీజిల్ రూ.88.23
బెంగళూరులో పెట్రోల్ రూ.97.64, డీజిల్ రూ.90.51
భోపాల్లో పెట్రోల్ రూ.102.61, డీజిల్ రూ.93.89
జైపూర్లో పెట్రోల్ రూ.101.02, డీజిల్ రూ.94.19
ఢిల్లీలో పెట్రోల్ రూ.94.49, డీజిల్ రూ.85.38