చిటపట చినుకులు పడుతూ ఉంటే ఆ వానలో తడిస్తే మనస్సుకు కలిగే ఆనందమే వేరు. అందుకే ప్రతి ఒక్కరూ తొలకరి జల్లుల్లో తడిసి ముద్దవ్వాలని అనుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి సాహసాలు చేయొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. వెదర్ లో సడన్ గా మార్పులు వస్తే దానికి అనుకూలంగా మన శరీరం అసలే అడ్జస్ట్ అవ్వదు. ముఖ్యంగా పలు ప్రాంతంల్లో పడే వర్షపు నీటిలో అనేక రకాల రసాయనాలు కూడా ఉంటాయి.
అందులోనూ సడెన్ గా మన శరీరం వర్షంలో తడిస్తే.. శరీరంలో వేడి పెరిగి.. ఇమ్యూనిటి శక్తి కూడా తగ్గుతుంది. ఇంకేముంది బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో కరోనా సోకే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనితో పాటుగా బ్లాక్ ఫంగస్ కూడా దాడి చేసే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారు. ఇవన్నీ సోకకుండా ఉండాలంటే వర్షపు నీటిలో తడవకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వానాకాలంలో సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.
జ్వరం, చలిజ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, పడిశం వంటి అనేక వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి తోడు ఈ కరోనా కూడా అంటుకునే అవకాశాలు చాలా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. వర్షంలో తడిస్తే.. మనం పెట్టుకున్న మాస్క్ కూడా తడిసిపోతుంది. ఇక మాస్క్ తడిస్తే ఒకవేళ మాస్క్ కు కరోనా వైరస్ అంటుకుంటే.. తడిసిన మాస్క్ నీటిలో కలిసి పోవడంతో ఆ నీరు మన నోరు, ముక్కుకి తగలడంతో కోవిడ్ బారిన పడొచ్చు. అందుకే వర్షంలో ఏ మాత్రం తడవకూడదని ఆరోగ్య నిపుణులకు సూచిస్తున్నారు.