Breaking
Sat. Jun 28th, 2025

జులై 1 నుంచి ఇంటర్ సెకండియర్‌ ఆన్‌లైన్ తరగతులు

Online Classes for Inter Second Year Students in Telangana from July 1st
Online Classes for Inter Second Year Students in Telangana from July 1st

దర్వాజ-హైదరాబాద్

వచ్చే నెల (జులై) 1 నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించనున్నామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించి తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డుకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, జులై 5వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలు కల్పించనున్నారు. దీనిపై ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ.. వచ్చే నెల 1 నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సైతం చేస్తున్నామని వెల్లడించారు.

ఆన్ లైన్ తరగతుల నేపథ్యంలో విద్యార్థులకు మరింత అనుకూలంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్టు జలీల్ తెలిపారు. అలాగే, విద్యార్థుల కోసం డిజిటల్ గ్రంథాలయాలు సైతం ఏర్పటు  చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఆన్ లైన్ తరగతులను దూరదర్శన్, టీ-శాట్ ద్వారా కూడా ప్రసారం చేస్తామని స్పష్టం చేశారు.

Related Post