కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనాతో చనిపోయిన మృతుల కుటుంబాలకు విపత్తు నిర్వహణ చట్టం కింద ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం విచారణ జరుపుతూ కేంద్రం స్పందన కోరగా.. ప్రకృతి వైపరీత్యాల విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం.. కరోనా మృతుల కఁటుంబాలకు నష్ట పరిహారాన్ని చెల్లించలేమనీ, అది కేవలం ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తేనే ఇవ్వగలమని కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది.
ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దాదాపు కరోనా కారణంగా 4 లక్షల మంది చనిపోయారు. ఆయా కుటుంబాలకు పరిహారం ఇస్తే.. కోవిడ్-19 సహాయ నిధులు అయిపోతయాని తెలిపింది. దీని వల్ల మనుముందు కరోనా సంబంధిత అవసరాలకు నిధులు లేకుండా పోతాయని పేర్కొంది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చెల్లించడమనేది రాష్ట్ర ప్రభుత్వాలకు శక్తికి మించిన భారంగా మారుతుందని తెలిపింది. అలాగే, ఒకవేళ కరోనాకు చెల్లించి.. ఇతర వ్యాధుల మరణాలకు నిరాకరించడం అన్యాయం అవుతుందని కేంద్రం పేర్కొంది.