Breaking
Sat. Jun 28th, 2025

8 రాష్ట్రాలకు కొత్త గ‌వ‌ర్న‌ర్లు

Eight states get new governors
Eight states get new governors

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

దేశంలో ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను నియమించింది. ఈ ఎనిమిది మందిలో నలుగురు కొత్త వారు కాగా, మిగిలిన నలుగురు బదిలీ అయ్యారు. కొత్తగా నియమించబడిన గవర్నర్లలో ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేత కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్‌గా నియమించారు. బీజేపీ రాజ్యసభ నాయకుడు, కేంద్ర మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ కర్నాటక గవర్నర్‌గా నియమితులయ్యారు. దీంతో త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఖాయమని తెలుస్తోంది. ఇక మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా మంగుభాయ్‌ ఛగన్‌భాయ్‌ పటేల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌ నియమితులయ్యారు.

కొత్త గవర్నర్ల నియమకాలతో పాటు మరో నాలుగు రాష్ట్రాల గవర్నర్లు బదిలీ అయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా కొనసాగుతున్న బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్‌గా నియమించారు. మిజోరం గవర్నర్‌గా కొనసాగుతున్న పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై గోవాకు బదిలీ చేశారు. హర్యానా గవర్నర్‌గా కొనసాగుతున్న సత్యదేవ్‌ నారాయణ్‌కు ఈశాన్య భారత రాష్ట్రమైన త్రిపుర గవర్నర్‌ బాధ్యతలు అప్పగించారు. త్రిపుర గవర్నర్‌గా కొనసాగుతున్న రమేశ్‌ బైస్‌ జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు.

Related Post