దేవుని పడకల్ గ్రామంలో ముక్కొటి వృక్షార్చన
దర్వాజ-రంగారెడ్డి
ప్రతిమనిషి మూడు మొక్కలు నాటాలనే సంకల్పంతో ప్రారంభమైన ముక్కొటి వృక్షార్చన కార్యక్రమం తలకొండపల్లి మండల పరిధిలోని దేవుని పడకల్ గ్రామంలో తాజాగా నిర్వహించారు. దీనిలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రాజమోని తిరుపతితో పాటు పార్టీ మండల ఉపాధ్యక్షుడు కుమ్మరి శంకర్, పడకల్ మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, ఎం.సత్యం, గ్రామ కమిటీ సభ్యులు కే.మల్లేష్, ఏ.లక్ష్మయ్య, వార్డు మెంబర్లు కే.రవి, కే.వెంకటేష్, జీ.గణేష్, స్వామి గౌడ్, కుమ్మరి సంఘం అధ్యక్షులు కే.బాలకిష్టి, జే.జంగయ్య, డీ.బాలరాజ్, కే.మల్లేష్, ఆర్.బాలరాజ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Share this content: