దర్వాజ-న్యూఢిల్లీ
తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు ఓ ట్వీట్ ను తొలగించడం పట్ల కాంగ్రెస్ పార్టీ స్పందించింది. రాహుల్ ఖాతాను తాత్కాలికంగా సస్పెండ్ చేసి, ఒక ట్విట్ ను తొలగించి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ట్విట్టర్ హరిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుకు తలొగ్గి ద్వంద్వ ప్రమాణాలతో ముందుకు సాగుతున్నదని విమర్శించింది. ట్విట్టర్ తీరును ఎండగడుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది.