దర్వాజ-అంతర్జాతీయం
ఆఫ్రికా దేశమైన మాలిలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా కాల్పులకు తెగబడటంతో ఏకంగా 40 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి స్థానిక మీడియా వివరాల ప్రకారం.. సోమవారం నైజర్ బోర్డర్ సమీపంలో ఉన్న ఓ గ్రామంపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. కౌరో అనే గ్రామంలో 20 మందినీ, ఓటగావు గ్రామంలో 14 మందిననీ, దౌత్గెఫ్ట్లో ఆరుగురిని కాల్చి చంపారు. ద్విచక్ర వాహనాలపై వచ్చి గ్రామాల్లో బీభత్సం సృష్టించారని స్థానికులు పేర్కొన్నారు.
వెస్ట్ ఆఫ్రికా దేశమైన మాలిలో 2012 నుంచి ఉగ్రవాదులు దాడులకు తెగబడుతూ.. పౌరుల ప్రాణాలు తీస్తున్నారు. ఉగ్రదాడులు కారణంగా మాలిలో ఇప్పటివరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ నిత్యం ఏదో ఒక చోట ఉగ్రవాదులు అలజడులు సృష్టిస్తున్నారు.