దర్వాజ-రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని దేవునిపడకల్ గ్రామానికి చెందిన అంబటి పెద్ద అంబటి పెద్ద జంగమ్మ (80), కాడమొని పెంటమ్మ (75) గురువారం మరణించారు. గ్రామ సర్పంచ్ శ్రీశైలం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తన వంతుగా 3000 రూపాయలు, జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ తరుపున 3000 రూపాయలు, మొత్తం 6000 రూపాయలు చొప్పున వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబటి రమేష్, శ్రీను, బిక్షపతి, యాదయ్య, వెంకయ్య, నర్సింహ, సాయిలు సహా గ్రామస్థులు పాల్గొన్నారు.
