Breaking
Sat. Jun 28th, 2025

పారాలింపిక్స్.. ఒకే రోజు భార‌త్‌కు 3 మెడ‌ల్స్

Tokyo Paralympics
Tokyo Paralympics

ద‌ర్వాజ‌-అంత‌ర్జాతీయం

Tokyo Paralympics 2021 : జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్ క్రీడల్లో భారత్ ఒకే రోజు మూడు మెడ‌ల్స్ లభించాయి. భారత టేబుల్ టెన్నిస్ ప్లేయ‌ర్‌ భవీనాబెన్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టిస్తూ.. పారాలింపిక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌లో రజత పతకం సాధించింది. చైనా ప్లేయర్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌ సీడ్‌ యింగ్‌ జావోతో జరిగిన ఫైన‌ల్‌ పోరులో 3-0తో బంగారు ప‌త‌కాన్ని గెలుచుకునే అవ‌కాశం కోల్పోయింది. . భ‌వానీబెన్‌పై 7-11, 5-11, 6-11 స్కోర్‌తో గెలిచి జావో.. గోల్డ్ మెడ‌ల్ సొంతం చేసుకుంది. అయితే పారాలింపిక్స్‌ చరిత్రలో టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కి పతకం దక్కడం ఇదే మొదటిసారి.

మెన్స్ హైజంప్ టీ47 ఫైన‌ల్లో ఇండియాకు చెందిన నిషాద్ కుమార్ కూడా సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచాడు. ఫైన‌ల్లో త‌న అత్యుత్త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న అయిన 2.06 మీట‌ర్ల ఎత్తు దూకిన నిషాద్‌.. ర‌జ‌త ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే, పురుషుల డిస్కస్ త్రో (ఎఫ్ 52) లో భార‌త క్రీడాకారుడు వినోద్ కుమార్ 19.91 మీటర్ల దూరం డిస్కస్‌ను త్రో చేసి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో టోక్యో పారాలింపిక్స్ లో భార‌త్ మెడ‌ల్స్ సంఖ్య మూడు చేరింది.

కాబుల్‌లో బాంబు పేలుడు.. 20 మంది మృతి

క‌రోనాతో అనాథ‌లైన ల‌క్ష మంది చిన్నారులు

వాట‌ర్ బాటిల్ రూ.3 వేలు.. ప్లేట్ భోజ‌నం రూ.7 వేలు

మైసూర్‌లో విద్యార్థినిపై సామూహిక లైంగిక‌దాడి

దశలవారీగా బడులు ప్రారంభించండి..

ఆన్‌లైన్ క్లాసులు.. అధిక ఫీజులు

ఆఫ్ఘానిస్థాన్ రాక్షస పాలన | తాలిబన్ షరియా చట్టమేంటి? 

Related Post