దర్వాజ-హైదరాబాద్
ఒకప్పుడు ఆడవాళ్లు కేవలం ఇంటికే పరిమితమయ్యే వారు. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంటిని చూసుకోవడంతో పాటుగా తమకిష్టమైన పనుల్లో సెటిల్ అవుతున్నారు. ఒక పక్క ఇంటి పనులు, మరో పక్క ఆఫీస్ వర్క్ ను కూడా సులభంగా చేసేస్తున్నారు. కానీ ఈ తీరిక లేని పనులతో మహిళలు ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు.
ఈ నొప్పుల నుండి ఉపశమనం పొందాలంటే ఈ కింది చిట్కాలను పాటిస్తే సరి. అల్లం ఒళ్లు నొప్పులను నివారించడంలో ముందుంటుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ల్పమేటరీ ఎలిమెంట్స్ శరీర వాపు, నొప్పులను తగ్గిస్తుంది. చిన్న అల్లం ముక్కను తీసుకుని దానిని నీటిలో మరిగించి ఫిల్టర్ చేయాలి. ఆ వాటర్ ను తాగితే ఒళ్లు నొప్పుల నుంచి తేలిగ్గా ఉపశమనం పొందవచ్చు.
వీటితో పాటుగా పసుపు పాలు కూడా ఈ నొప్పుల నుంచి రిలీఫ్ ను ఇస్తాయి. వేడి వేడి పాలల్లో ఒక టీ స్పూన్ పసుపు కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే ఒంటి నొప్పులు మటుమాయం అవుతాయి. అలాగే నైట్ పడుకునే ముందు చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఈ సమస్యకే కాకుండా బెల్లం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. ఒళ్లు నొప్పుల నుంచి బయటపడాలంటే పైన తెలిపిన చిట్కాలను క్రమం తప్పకుండా పాటించాలి.