దర్వాజ-ఉత్తరప్రదేశ్
గతేడాది చైనాలోని వూహాన్ నగరంలో వెలుగుచూసిన కరోనా వైరస్.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఇప్పటికీ తన పంజా విసురుతోంది. భారత్లోనూ నిత్యం వందలాది మందిని సైతం బలితీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్లో ఎన్నికల విధుల్లో పాల్గొని 2,097 మంది ప్రభుత్వ సిబ్బంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది ఉపాధ్యాయులే ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 15-29 వరకు నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగ్గా.. మే 2న ఓట్ల లెక్కింపు జరిగింది. పంచాయతీరాజ్ అదనపు ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల కార్యదర్శికి తెలియజేశారు.
తెలుగు రాష్ట్రాల్లో గలీజు రాజకీయాలు
గుంటూరులో విద్యార్థిని దారుణ హత్య
ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ల రాక్షస పాలన.. షరియా చట్టం