Loading Now
Manchu Manoj singareni colony

మీడియాపై మంచు మ‌నోజ్ ఫైర్

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

సైదాబాద్‌లోని సింగ‌రేణి కాల‌నీలో ఆరేండ్ల బాలిక‌పై పాశ‌వికంగా లైంగిక‌దాడి.. హ‌త్య గురైన ఘ‌ట‌న‌పై సినీ న‌టుడు మంచు మ‌నోజ్ స్పందిస్తూ మీడియాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంత‌టి క్రూర‌మైన‌, అమానూష‌మైన ఘ‌ట‌న‌కు మీడియా క‌వ‌రేజీ ఇవ్వ‌క‌పోవ‌డం.. అదే హీరో సాయి ధ‌ర‌మ్‌తేజ్ ఆక్సిడెంట్‌ను త్రీడీ చేసి మ‌రి చూపించిన మీడియా తీరుపై త‌ప్పుబ‌ట్టారు. మీడియా ఈ ఘటనను ప్రపంచానికి తెలిసేలా ప్రచారం చేయాలని కోరారు. ప్రభుత్వం, పోలీసులు నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

టీవీ చానల్స్ ఆన్‌చేస్తే.. సాయి ధరమ్ తేజ్ బైక్ పై నుంచి ఇలా పడ్డాడు.. అలా పడ్డాడు అని చూపిస్తున్నారు. సింగ‌రేణిలో అత్యంత దారుణంగా లైండిక‌దాడి, హ‌త్య‌కు గురైన చిన్నారి ఘ‌ట‌న‌ను మీడియా చూపించ‌డం లేదు. మీడియా ఎందుకు దీనిని హైలెట్ చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ప్ప‌టికైనా మీడియా దీనిని ప్ర‌పంచం ముందు చూపించాల‌ని అన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. నిందితున్ని పట్టుకొని క‌ఠినంగా శిక్షించాల‌ని పోలీసుల‌ను కోరారు.

తెలుగు రాష్ట్రాల్లో గలీజు రాజకీయాలు

గుంటూరులో విద్యార్థిని దారుణ హత్య

ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ల రాక్షస పాలన.. షరియా చట్టం

Share this content:

You May Have Missed