• తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్
దర్వాజ-రంగారెడ్డి
కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందడానికి ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్లు వేయించుకోవాలని తలకొండపల్లి జడ్పీటీసీ, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ ఉప్పల వెంకటేష్ అన్నారు. తాజాగా ఆయన తలకొండపల్లి మండలంలోని పడకల్ గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొండానికి, ప్రజలందరూ ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా టీకాలు వేయించుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారి ప్రభావం మున్ముందు మరింతగా పెరిగిన.. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి టీకాలు వేయించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకటేష్తో పాటు ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, స్థానిక ఎంపీటీసీలు జోగు రమేష్, రఘు, మండల సర్పంచ్ సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్, సర్పంచులు శ్రీశైలం, లక్ష్మణ్ నాయక్, సింగల్ విండో డైరెక్టర్ దేవ్ల నాయక్, విజయ్, బీ. మహేష్, వెంకటయ్య, బీ.రమేష్, ఎస్. శ్రీకాంత్, లింగం, ఎస్. నరేష్ , ఎస్. రమేష్, సీహెచ్. మహేష్, సీహెచ్. వెంకటయ్య, సీహెచ్. శివ, వెంకటేష్, నరసింహ, జే. జంగయ్య, జే. శ్రీను సాయి, గ్రామ ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సింగరేణి కాలనీ ఘటన నిందితుడు ఆత్మహత్య
మోడీ పుట్టిన రోజునే ‘నిరుద్యోగ దినోత్సవం’
గుజారత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక క్రైమ్ రేటు
తెలుగు రాష్ట్రాల్లో గలీజు రాజకీయాలు
గుంటూరులో విద్యార్థిని దారుణ హత్య
ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ల రాక్షస పాలన.. షరియా చట్టం