దర్వాజ-రంగారెడ్డి
తలకొండపల్లి మండలంలోని దేవునిపడకల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. అలాగే, విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు వంటి రక్షణ వస్తువులను అందించింది. ఈ సందర్భంగా విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ చైర్మన్ వాసుదేవరావు కరోనా రక్షణకు సంబంధించిన పలు అంశాల గురించి విద్యార్థులకు వివరించారు.
ఈ శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో దేవుని పడకల్ గ్రామ సర్పంచ్ కె.శ్రీశైలం, ఉప సర్పంచ్ ఆర్.తిరుపతి, విద్యా కమిటీ చైర్మన్ అంబటి లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు శోభ, స్కూల్ ప్రధానోపాధ్యాయులు సురేష్ రెడ్డి, విద్యా ఫౌండేషన్ సెక్రటరీ పూర్ణ చందర్ రావు, మహేష్, త్రిలోక్, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
మేఘాల్లో విహరిస్తున్న బుట్టబొమ్మ.. ఎందుకంటే?
డిప్రెషన్ ను తగ్గించే చిట్కాలివిగో..