• రవాణా స్థంభన.. కొనసాగుతున్న రాస్తారోకోలు, ర్యాలీలు
• దేశరాజధానిలో భద్రత పెంపు
• కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్
దర్వాజ-న్యూఢిల్లీ
Bharat Bandh : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు నేపథ్యంలో నేడు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఎస్కేఎం నేతృత్వంలో దాదాపు 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, వివిధ రాజకీయా పార్టీలు ఈ బంద్కు మద్దతును ప్రకటించాయి. వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి సోమవారానికి (సెప్టెంబర్ 27) ఏడాదైన సందర్భంగా రైతు సంఘాల ఉమ్మడి వేదికైన సంయుక్త కిసాన్ మోర్చా ఈ దేశవ్యాప్త నిరసన చేపట్టింది.
కాగా, నేడు కొనసాగుతున్న భారత్ బంద్కు కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్రాలతో పాటు కేరళ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ప్రభుత్వాలు సైతం మద్దతు ప్రకటించాయి. బంద్ దృష్ట్యా దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించారు. నిరసన వేదికల నుంచి ఢిల్లీలోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు.
ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారత్ బంద్ కొనసాగుతోంది. ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు సైతం నిరసనలను నిర్విహిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నాయి. ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక నిర్ణయాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఉత్తర భారతంలోని జాతీయ రహదారులను అక్కడి రైతులను దిగ్భందించారు. రైల్వే ట్రాక్లపై నిరసనకు దిగారు. దీంతో బస్సులు, రైళ్ల రాకపోకలు చాలా చోట్ల నిలిచిపోయాయి.
పెగాసస్ తో నిఘా పెట్టారు: కేంద్రంపై మమత ఫైర్
మేఘాల్లో విహరిస్తున్న బుట్టబొమ్మ.. ఎందుకంటే?