దర్వాజ-నిజామాబాద్
Nizamabad gang rape: బలవంతంగా మద్యం తాగించి.. ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన నిజామాబాద్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నిజామాబాద్ పట్టణంలోని ఓ ప్రయివేటు ఆస్ప్రతిలో మంగళవారం అర్ధరాత్రి.. ఓ గది నుంచి యువతి అరుపులు కేకలు విన్న సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి వెళ్లి చూశారు. అక్కడ ఉన్న యువతిపై లైంగికదాడి జరిగిందని గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. యువతి మద్యం మత్తులో ఉందని గుర్తించారు. బాధితురాలికి బలవంతంగా మద్యం తాగించి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని ప్రాథమికంగా సమాచారం. ప్రస్తుతం బాధితురాలిని మరో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నలుగురు యువకులు తనపై లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారనీ, వారి కోసం గాలింపు చేపట్టామని పేర్కొన్నారు. దీని కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని వెల్లడించారు. కాగా, ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కుండపోత వర్షం.. నీటమునిగిన హైదరాబాద్
పెగాసస్ తో నిఘా పెట్టారు: కేంద్రంపై మమత ఫైర్