• విద్యుత్ చార్జీలు సైతం పెరిగే అవకాశం
• ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల కరెంట్ కొతల హెచ్చరికలు
• కొన్ని నెలల పాటు వినియోగదారులపై ప్రభావం: ప్రణవ్ మాస్టర్
• నాలుగు నుంచి ఆరు నెలల వరకు..: కేంద్ర మంత్రి
దర్వాజ-న్యూఢిల్లీ
Power crisis deepens in India: ప్రపంచలో వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. అయితే, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లలో సరిపడా విద్యుత్ అందించడం ఒకటి. తాజా పరిస్థితులు గమనిస్తే.. భారత్లో ఉత్పత్తయ్యే విద్యుత్లో 70 శాతానికి పైగా పొగ్గు నుంచే వస్తున్నది. అయితే, దేశంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు కనిష్ట స్తాయికి పడిపోయాయి. దీంతో విద్యుత్ సంక్షోభం తలెత్తే పరిస్థితులున్నాయి.
బొగ్గు నిల్వలు గత నెల చివర్లో దేశవ్యాప్తంగా ఉన్న థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 4 రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. ఇక ఆగస్టులో అయితే 13 రోజులకు సరిపడా నిల్వలున్నాయి. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇప్పటికే సగానికిపైగా కేంద్రాలు విద్యుత్ కోతలకు సంబంధించిన హెచ్చరికలు చేశాయి.
రెండు సవాళ్లు..
భారత్ ముందు ప్రస్తుతం రెండు ప్రధాన సవాళ్లున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకటి కరోనా తర్వాత పారిశ్రామిక రంగం ఊపందుకోవడంతో విద్యుత్ డిమాండ్ పెరగడం. రెండోది డిమాండ్కు తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు సరఫరా లేకపోవడం. దేశ బొగ్గు అవసరాల్లో ఎక్కువ భాగం దేశీయంగానే సరఫరా అవుతుంది. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో బొగ్గు గనుల్లోకి నీరు చేరడం, రవాణా మార్గాలు దెబ్బతినడంతో ఉత్పత్తిపై ప్రభావం పడింది. దీంతో థర్మల్ పవర్ ప్లాంట్లను బొగ్గు సమస్య సవాలుగా నిలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే దొరికిన చోట ధరతో సంబంధం లేకుండా కొనుక్కొవడం లేదా విదేశాల నుంచి సముద్ర మార్గల ద్వారా దిగుమతి చేసుకోవడం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. అయితే, పై రెండు అంశాలు కూడా భారీ ధరలతో కూడుకున్నవిగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
తగ్గిన బొగ్గు నిల్వలు
సెప్టెంబర్ చివరి నాటికి థర్మల్ పవర్ ప్లాంట్ల వద్ద ఉన్న బొగ్గు నిల్వలు 81 లక్షల టన్నులకు తగ్గిపోయాయని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. గతేడాదితో పోలిస్తే అది 76 శాతం తక్కువ. ప్రస్తుతం అవి 60 వేల నుంచి 80 వేల టన్నుల కొరతతో ఒక్కో ప్లాంట్ నడుస్తోందని సమాచారం.
ఆరు నెలల వరకు ఈ సంక్షోభం..
మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఈ సంక్షోభం నాలుగు నుంచి ఆరు నెలలు ఉండే అవకాశముందని పేర్కొన్నారు. ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండడంతో డిమాండ్ కొంత తక్కువగా ఉందనీ, అక్టోబర్ మధ్య నాటికి గానీ ఏమీ చెప్పలేమని అన్నారు. దేశంలో అత్యంత ఎక్కువగా విద్యుత్తును ఉత్పత్తి చేసే ఎన్టీపీసీ, కోల్ ఇండియా లతో చర్చలు జరుపుతున్నామన్నారు.
విద్యుత్ ధరలు పెరిగే అవకాశం
తాజా పరిస్థితులపై క్రెడిట్ రేటింగ్స్ సంస్థ క్రిసిల్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రణవ్ మాస్టర్ మాట్లాడుతూ.. త్వరలో విద్యుత్ ధరలు పెరిగే అవకాశముందన్నారు. కరెంట్ కోతలు తప్పేలా లేవనీ, ధరల ప్రభావం నెలల పాటు వినియోగదారులపై పడే అవకాశముందని తెలిపారు.
నిలిచిపోయిన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్..
అఫ్ఘాన్లో బాంబు దాడి.. 14 మంది మృతి
రైతులపైకి దూసుకెళ్లిన కేంద్రమంత్రి కాన్వాయ్.. 8 మంది మృతి
లింగ వివక్ష.. పితృస్వామ్యం.. మధ్యలో మహిళ !
పెరిగిన పెట్రోల్ ధరలు.. సెంచరీ కొట్టిన డీజిల్
లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక కారణాలు..
యూపీలో మరో దారుణం.. బాలికపై లైంగిక దాడి.. హత్య !