Breaking
Sat. Jun 28th, 2025

ప్రాణాలు తీసి నిర‌స‌న‌కారుల నోరు మూయ‌లేరు..

FarmerProtest
FarmerProtest

• శాతియుత నిర‌స‌న‌.. వెనుక‌నుంచి రైతుల‌పైకి పొనిచ్చిన కారు
• మ‌రో వీడియో షేర్ చేసిన బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ
varun gandhi : ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌పైకి కేంద్ర మంత్రి కారు దూసుకెళ్లిన ఘ‌ట‌న‌లో 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. అయితే, రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న ఎంపీ వ‌రుణ్ గాంధీ.. రైతుల‌పైకి దూసుకెళ్తున్న కారు ఘ‌ట‌న వీడియోను పోస్టు చేశారు. తాజాగా మ‌రో వీడియోను పోస్టు చేశారు. ఇందులో శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌పైకి వెనుక నుంచి కేంద్ర మంత్రికి చెందిన వాహ‌నం దూసుకొచ్చింది. దీంతో రొడ్డు ప‌క్క‌గా రైతులు చెల్ల‌చెదురుగా ప‌డివున్న హృద‌య‌విదార‌క దృశ్యాలు అందులో క‌నిపిస్తున్నాయి.

వీడియో షేర్ చేస్తూ.. రైతుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి వ‌రుణ్ గాంధీ..‘ఈ వీడియో క్రిస్టల్ క్లియర్‌గా ఉన్నది. హత్యలు చేసి నిరసనకారుల నోరు మూయలేరు. అమాయక రైతుల రక్తానికి కచ్చితంగా జవాబుదారీ ఉండాల్సిందే. న్యాయం సత్వరమే చేకూరాలి. అహంకారం, క్రూరత్వ సందేశాలు రైతుల హృదయాలకు చేరే ముప్పు ఉన్నదనీ, వెంటనే న్యాయం జరగాలి’ అని డిమాండ్ చేశారు.

కాగా, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యలు పాల్గొంటున్న ఓ కార్యక్రమానికి నిరసనగా రైతులు ల‌ఖింపూర్‌ఖేరీలో నిరసనలు చేస్తున్నారు. వారి వెనుక నుంచి వచ్చిన కేంద్ర మంత్రి కాన్వాయ్ వారిపై నుంచి దూసుకెళ్లింది. వరుణ్ గాంధీ ట్వీట్ చేసిన వీడియోలు ఆ కార్లపై దాడి జరిగినట్టుగా కనిపించడం లేదు. కావాలనే ఆందోళనకారులపైకి కారు దూసుకెళ్లినట్టు వీడియో చూపిస్తున్నది.

https://darvaaja.com/lakhimpur-kheri-violence/

బ్లాక్ ఫంగస్.. ప్ర‌పంచంలోని మొత్తం కేసుల్లో 71 శాతం భారత్‌లోనే..

రైతుల‌పైకి దూసుకెళ్లింది మా కారే.. : కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్ర‌

బొగ్గు సంక్షోభంతో క‌రెంట్ కష్టాలు..

నిలిచిపోయిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్..

అఫ్ఘాన్‌లో బాంబు దాడి.. 14 మంది మృతి

రైతుల‌పైకి దూసుకెళ్లిన కేంద్ర‌మంత్రి కాన్వాయ్‌.. 8 మంది మృతి

లింగ వివక్ష.. పితృస్వామ్యం.. మధ్యలో మహిళ !

పెరిగిన పెట్రోల్ ధరలు.. సెంచరీ కొట్టిన డీజిల్

లాల్ బహదూర్ శాస్త్రి మ‌ర‌ణం వెనుక కార‌ణాలు..

Related Post