Breaking
Sat. Jun 28th, 2025

యూపీ సర్కారు తీరుపై సుప్రీం అసంతృప్తి

Supreme Court
Supreme Court

• ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌లో తీసుకున్న చ‌ర్య‌లు ఆమోదయోగ్యం కాదంటూ వ్యాఖ్య

• ఇంకా నిందితులను అరెస్ట్ చేయ‌ని పోలీసులు

దర్వాజ-న్యూఢిల్లీ

Lakhimpur issue_Supreme Court : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌పైకి కారును పోనివ్వ‌డంతో 8 మంది ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌ను సుమోటోగా స్వీక‌రించిన సుప్రీంకోర్టు.. విచార‌ణ జ‌రుపుతోంది. ఈ క్ర‌మంలోనే రైతుల మరణం కేసులో యూపీలోని బీజేపీ సర్కారు తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి యూపీ ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది.

“సాధారణ పరిస్థితుల్లో కూడా పోలీసులు వెంటనే స్పందించకుండా, నిందితులను అదుపులోకి తీసుకోకుండా ఏం సందేశాన్ని అందించాలనుకుంటున్నారు. ఈ కేసులో నిందితులపై 302 సెక్షన్ మోపబడింది. ఇది హత్యకు సంబంధించిన సెక్షన్. ఈ సెక్షన్ పై నమోదయ్యే ఇతర కేసుల్లో ఎలా వ్యవహరిస్తారో లఖింపూర్ కేసు నిందితులతోనూ అలాగే వ్యవహరించండి అంటూ యూపీ ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ ఈ నెల 20న జ‌ర‌గ‌నుంది.

కేంద్ర మంత్రి త‌న‌యుడిని అరెస్ట్ చేయ‌ని పోలీసులు

ఇదిలావుండ‌గా, ల‌ఖింపూర్ ఖేరిలో రైతులు ప్రాణాలు కోల్పోవ‌డానికి కార‌ణ‌మంటూ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను పోలీసులు ఇంకా అరెస్ట్ చేయ‌లేదు. దీంతో పోలీసులు, ప్ర‌భుత్వ తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కావాల‌నే రైతులపైకి కారుతో తొలార‌ని రైతు సంఘాలు, ఘ‌ట‌న‌స్థ‌లంలో ఉన్న వారు ఆరోపిస్తున్నారు. అలాగే, ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో దృశ్యాల్లో.. శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌పైకి వెనుక నుంచి కారు వేగంగా దూసుకురావ‌డం క‌నిపిస్తోంది. కారు ఢీ కొన్న వెంట‌నే రైతులు రొడ్డుపై చెల్లాచెదురుగా ప‌డ్డారు.

తుమ్మును ఆపితే ఏం జరుగుతుందో తెలుసా?

రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న బేబమ్మ..

ఆఫ్ఘానిస్థాన్‌లో బాంబు పేలుడు.. 50 మంది మృతి

పాకిస్థాన్‌లో భారీ భూకంపం

ఆ రైతులను కావాలనే చంపారా?

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడే కారు న‌డిపాడు: గాయపడ్డ రైతు

బ్లాక్ ఫంగస్.. ప్ర‌పంచంలోని మొత్తం కేసుల్లో 71 శాతం భారత్‌లోనే..

రైతుల‌పైకి దూసుకెళ్లింది మా కారే.. : కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్ర‌

బొగ్గు సంక్షోభంతో క‌రెంట్ కష్టాలు..

నిలిచిపోయిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్..

Related Post