• ప్రపంచవ్యాప్తంగా రెండు గంటల పాటు నిలిచిన సేవలు
• మళ్లీ క్షమాపణలు కోరిన యాజమాన్యం
దర్వాజ-హైదరాబాద్
Facebook and Whatsapp down: సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ఫామ్లు వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు మళ్లీ నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటల పాటు సేవల్లో అంతరాయం ఏర్పడింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ సమస్య వచ్చింది. సోషల్ మీడియా సైట్ల అంతరాయంపై కథనాలు రాసే డౌన్ డిటెక్టర్ అనే సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. నాలుగు రోజుల క్రితం ఇలాగే ఈ మూడింటి సేవలు గంటల తరబడి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఒక్క వారంలోనే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు సేవలకు అంతరాయం ఏర్పడటం గమనార్హం. దీంతో యూజర్స్ ట్విట్టర్ లో తమ అసహనాన్ని వెలిబుచ్చారు.
ఈ నేపథ్యంలోనే అంతరాయం పట్ల ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు ట్విట్టర్ లో విచారం వ్యక్తం చేశాయి. ప్రపంచంలోని చాలా మంది యూజర్లకు సమస్య తలెత్తిన విషయం తెలిసిందననీ, మళ్లీ యథాస్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఫేస్ బుక్ తెలిపింది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించింది. కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. తిరిగి 2 గంటల తర్వాజ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
అయితే, ఇలా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంపై యాజమాన్యం సరైన కారణాలు వెల్లడించడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటి సేవలు నిలిచిపోవడం వెనుక చైనా హ్యాకర్ల హస్తం ఉందని అమెరికా అనుమానం వ్యక్తం చేసింది.
యూపీ సర్కారు తీరుపై సుప్రీం అసంతృప్తి
తుమ్మును ఆపితే ఏం జరుగుతుందో తెలుసా?
రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న బేబమ్మ..
ఆఫ్ఘానిస్థాన్లో బాంబు పేలుడు.. 50 మంది మృతి
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడే కారు నడిపాడు: గాయపడ్డ రైతు
బ్లాక్ ఫంగస్.. ప్రపంచంలోని మొత్తం కేసుల్లో 71 శాతం భారత్లోనే..
రైతులపైకి దూసుకెళ్లింది మా కారే.. : కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర