దర్వాజ-న్యూఢిల్లీ
Delhi’s air quality: దేశరాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మళ్లీ ప్రమాదకరంగా మారతూ.. గాలిని పీల్చుకోనివ్వటం లేదు. దాదాపు తొమ్మది నెలల తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర కేటాగిరిలోకి చేరింది. ఈ వారం ప్రారంభంలోనే వాయు కాలుష్యం, ఢిల్లీ పరిసర ప్రాంత వ్యవసాయ పొలాల్లో గడ్డిని కాల్చకుండా.. వాటిని భూమిలో కలిసిపోయేలా చేసే రసాయనాలను ఉపయోగించడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ రైతులకు సూచించిన సంగతి తెలిసిందే.
అయితే, రాజధానిలో వాహనాల వినియోగం అధికం కావడంతో శీతాకాలానికి ముందే ఢిల్లీ ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఏకంగా 322 కు పెరిగింది. గాలిలో కాలుష్య కారకాలు పీఎం 2.5, పీఎం 10 అధికమయ్యాయి. ఏక్యూఐ 171 కి పెరగడంతో దేశ రాజధానిలో కాలుష్య ప్రభావం చూపడం మళ్లీ మొదలైందని కేంజ్రీవాల్ ప్రకటించారు. గత నెల నుంచి ఆయన ఢిల్లీ రోజువారీ గాలి నాణ్యతను ఆయన ట్వీట్ చేస్తున్న సంగతి తెలిసిందే. నూతన సాంకేతికతతో ఎన్సీఆర్ ప్రాంతాల్లో థర్మల్ పవర్ ప్లాంట్లను రీట్రాఫిట్ చేయాలన్నారు. సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెంచాలన్నారు. ఉష్ట్రోగ్రతలు పెరుగుదల కారణంగా గత నెల నుంచి గాలి నాణ్యత క్షీణిస్తున్నదని పేర్కొన్నారు.
భారీ వర్షంతో మళ్లీ నీటమునిగిన హైదరాబాద్. వైరలవుతోన్న వీడియోలు
లఖింపూర్ హింస: పోలీసుల ముందుకు కేంద్ర మంత్రి కుమారుడు
వాట్సాప్, ఫేస్ బుక్ లో మళ్లీ అదే సమస్య
యూపీ సర్కారు తీరుపై సుప్రీం అసంతృప్తి
తుమ్మును ఆపితే ఏం జరుగుతుందో తెలుసా?
రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న బేబమ్మ..
ఆఫ్ఘానిస్థాన్లో బాంబు పేలుడు.. 50 మంది మృతి