Breaking
Sat. Jun 28th, 2025

వరుసగా ఆరో రోజూ పెట్రో వడ్డన

Petrol price hits record
Petrol price hits record

• లీటరు పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెంపు
• దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్‌ రూ.100కు పైనే

దర్వాజ-న్యూఢిల్లీ

Petrol price hits record: దేశంలో చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న పెట్రోల్‌ ధరలు వాహనదారుల నడ్డివిరుస్తున్నాయి. వ‌రుసగా ఆరో రోజు సైతం చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచాయి. ఆదివారం లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల చొప్పను పెంచాయి. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధాని ప్రాంతాల్లో లీటరు పెట్రోల్‌ ధర సెంచరీ దాటింది. డీజిల్‌ ధరలు సైతం పలు ప్రాంతాల్లో లీటరుకు రూ.100 దాటగా, మరికొన్ని ప్రాంతాల్లో సెంచరీకి చేరువయ్యాయి.

దేశరాజధాని ఢల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ ధర రూ.104.14కు చేరగా, డీజిల్‌ ధర రూ.92.82కు పెరిగింది. ఇప్పటివరకు ఢల్లీలో నమోదైన ధరల్లో ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ ధరలే అత్యధికమని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.110.12కు పెరిగింది. లీటరు డీజిల్‌ ధరపై 37 పైసలు పెరగడంతో ప్రస్తుతం రూ.100.66కు చేరింది. ఇక బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో లీటరు పెట్రోల్‌ రూ.104.80, డీజిల్‌ రూ.95.93గా, చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.101.53, డీజిల్‌ ధర రూ.97.26గా ఉంది.

ఇక మరో మెట్రో నగరమైన బెంగళూరులో లీటరు పెట్రోల్‌ ధర రూ.107.77, డీజిల్‌ రూ.98.52గా ఉండ‌గా, జైపూర్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.112.06, డీజిల్‌ రూ.103.08గా కొనసాగుతోంది. భారత్‌ తన 85 శాతం చమురు అవసరాలను తీర్చుకోవడానికి దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనికి తోడు అంతర్జాతీయంగా కొనసాగుతున్న చమురు మార్కెట్‌ పరిస్థితులు, దేశీయంగా చ‌మురుపై పన్నులు అధికంగా ఉండటంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ప్రభావితమవుతున్నాయి.

https://www.facebook.com/Darvaaja-News-110137454451491/

ఢిల్లీ గాలి పీల్చుకోనివ్వ‌ట్లేదు !

భారీ వర్షంతో మ‌ళ్లీ నీట‌మునిగిన హైదరాబాద్. వైర‌ల‌వుతోన్న వీడియోలు

ల‌ఖింపూర్‌ హింస: పోలీసుల ముందుకు కేంద్ర మంత్రి కుమారుడు

వాట్సాప్, ఫేస్ బుక్ లో మళ్లీ అదే సమస్య

యూపీ సర్కారు తీరుపై సుప్రీం అసంతృప్తి

తుమ్మును ఆపితే ఏం జరుగుతుందో తెలుసా?

రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న బేబమ్మ..

ఆఫ్ఘానిస్థాన్‌లో బాంబు పేలుడు.. 50 మంది మృతి

Related Post