• కోవాగ్జిన్కు ఆమోదం తెలిపిన నిపుణుల కమిటీ
దర్వాజ-న్యూఢిల్లీ
Covaxin: 2-18 ఏళ్ల వయసు మధ్య పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం కోవాగ్జిన్ వ్యాక్సిన్కు అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ఐసీఎంఆర్తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ను పిల్లలకు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది.
కాగా, ఇప్పటికే 18 ఏండ్ల లోపు పిల్లలపై రెండు, మూడో దశల ట్రయల్స్ సైతం పూర్తయ్యాయి. దీనికి సంబంధించి డేటాను ఇప్పటికే డ్రగ్స్ అండ్ కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి సమర్పించింది. ఇదిలావుంగా, కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి కూడా ఇంకా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలుపలేదు. 18 ఏండ్లలోపు వారికి కోవాగ్జిన్ ఇవ్వడానికి అత్యవసర వినియోగానికి ఆమోదం కోసం దరఖాస్తు చేసుకున్న తక్కువ సమయంలో దీనికి నిపుణుల కమిటీ ఆమోదం తెలుపడంపై పలువరు వైద్య నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తూ.. డేటాపై ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఢిల్లీలో పాక్ ఉగ్రవాది అరెస్ట్
క్లిష్ట పరిస్థితుల్లో.. విద్యుత్ సంక్షోభం.. : కేజ్రీవాల్
జమ్మూకాశ్మీర్లో ఎదురుకాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి
లఖింపూర్ కేసు: కేంద్ర మంత్రి, ఆయన కుమారుడిని కాపాడేందుకు యోగి ప్రయత్నం