Breaking
Sat. Jun 28th, 2025

బాల్య వివాహాలు.. ఏటా 22 వేల మంది బాలిక‌లు బలి

Child marriage

• దక్షిణాసియాలో ఏటా 2 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు
• ‘సేవ్‌ ది చిల్డ్రన్‌’ నివేదిక వెల్లడి

ద‌ర్వాజ‌-న్యూఢల్లీ
Child marriage: కాలంతో పాటు ఆధునీకత వైపు ప్రపంచం పరుగులు పెడుతున్నా సమాజంలో అనాధిక వస్తున్న కొన్ని విషయాలు మారడం లేదు. ఇలాంటి వాటిల్లో బాల్య వివాహాలు కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాల కారణంగా నిత్యం 60 మందికి పైగా బాలికలు బలవుతున్నారని ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం’ సందర్భంగా ‘గ్లోబల్‌ గర్ల్‌వుడ్‌ రిపోర్ట్‌`2021’ పేరిట ‘సేవ్‌ ది చిల్డ్రన్‌’ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఒక్క దక్షిణాసియాలోనే బాల్య వివాహాల కారణంగా ప్ర‌తిరోజూ ఆరుగురు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది. ఇలా చిన్న వయసులోనే పెండ్లిళ్లు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రతి ఏటా దాదాపు 22వేల మందికి పైగా బాలికలు చనిపోతున్నారని వెల్లడిరచింది.

సేవ్‌ ది చిల్డ్రన్ నివేదిక వెల్లడిరచిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.. బాల్య వివాహాల కారణంగా దక్షిణాసియాలో ప్రతి సంవత్సరం 2 వేల మందికి పైగా బాలికలు చనిపోతున్నారు. తూర్పు ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలో 650 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ ప్రాంతాల్లో ఏటా 560 మంది మరణిస్తున్నారు. తూర్పు, సెంట్రల్‌ ఆఫ్రికాలో అత్యధిక బాల్యవివాహాలు చోటుచేసుకుంటున్నాయి. బాల్య వివాహ స‌మ‌స్య‌ల‌తో అక్క‌డ ప్రతి సంవత్సరం 9600 బాలికలు చనిపోతున్నారు. బాల్య వివాహాల వల్ల ఎదురయ్యే గర్భాశయ సమస్యలు, మాతశిశు మరణాలు ప్రపంచ వ్యాప్తంగా ఏటా 22వేలకు పైగా ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది.

‘‘గత 25 ఏండ్లలో ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల బాల్య వివాహాలు నిరోధించినప్పటికీ.. కరోనా మహమ్మారి కారణంగా పురోగతి నిలిచిపోయి.. పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. పాఠశాలల మూతపడడం, ఉపాధి అవకాశాలు దెబ్బతినడం వంటి కారణాలతో పేదరికం మరింతగా పెరుగుతోంది. దీంతో 2030 నాటికి మరో కోటి మంది బాలికలు బాల్య వివాహాలు చేసుకునే అవకాశముంది. దీంతో బాల్య వివాహా మరణాల పెరిగే అవకాశం ఎక్కువ‌గా ఉంది’’ అని సేవ్‌ ది చిల్డ్రన్ నివేదిక పేర్కొంది.

బాల్య వివాహాల్లో మరణాలకు ప్రధాన కారణం ప్రసవాలు. ఎందుకంటే ఆ వయస్సులో వారి శరీరం పిల్లలను కనడానికి సిద్ధంగా ఉండ‌దు. చిన్న వయస్సులోనే పిల్లలకు జన్మనివ్వటం వల్ల.. వారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువ‌గా వచ్చే అవకాశాలు ఉన్నాయ‌ని తెలిపింది. బాల్య వివాహాల విషయంలో ప్రభుత్వాలు, ఎన్జీవోలు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కార్యక్రమాలు నిర్వహించాలని సేవ్‌ ది చిల్డ్రన్ నివేదిక సూచించింది.

2-18 వ‌య‌స్సుల వారికి క‌రోనా వ్యాక్సిన్‌

ఢిల్లీలో పాక్ ఉగ్ర‌వాది అరెస్ట్‌

ఈటల రాజేందర్‌పై కేసు నమోదు

క్లిష్ట పరిస్థితుల్లో.. విద్యుత్‌ సంక్షోభం.. : కేజ్రీవాల్‌

యూపీలో నిరంకుశ పాల‌న..

జమ్మూకాశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి

లఖింపూర్ కేసు: కేంద్ర మంత్రి, ఆయ‌న కుమారుడిని కాపాడేందుకు యోగి ప్రయత్నం

మండిపోతున్న పెట్రోల్ ధరలు

Related Post