దర్వాజ-న్యూఢిల్లీ
Petrol Price Hiked : సామాన్యుడికి చమురు అందని ద్రాక్షగా మారుతోంది.. మారింది కూడా. కరోనా పుణ్యమా అని ఉద్యోగాలు పోయి.. చేతిలో పని లేక దిక్కు తోచని స్థితిలో ఉంటే.. ఇష్టారాజ్యంగా చమురు ధరలను పెంచేస్తోంది ప్రభుత్వం. కుటుంబ బండిని నడిపే పైసలే లేవు. కానీ కూరగాయల ధరలు, పప్పులు, ఉప్పుల ధరలు విచ్చల విడిగా పెరిగిపోయాయి. దీనికి తోడు పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి.ఈ బాదుడుకు బండిని అమ్మి బస్సుల్లో వెళ్లడమే మేలనుకుంటున్నారు సామాన్యులు. వరుసగా మూడో రోజూ కూడా రికార్డు స్థాయిలో చమురు ధరలు పెరిగినయి. పెట్రోల్, డీజిల్ పై 35 పైసల చొప్పున పెంచేశాయి దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు.
ప్రస్తుతం ఢిలీల్లో పెట్రోల్ రూ. 106.89 లీటర్ ధర ఉండగా, రూ.95.62 గా డీజిల్ ఉంది. ముంబైలో అయితే డీజిల్ 103.36, పెట్రోల్ 112.78 గా ఉంది. ఇకపోతే కోల్ కతాలో డీజిల్ రూ. 98.73 ఉండగా, పెట్రోలో 107.45 గా ఉంది. ఇక హైదరాబాద్ లో ఈ ధరల పెంపుతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.111.18 గా ఉంది. డీజిల్ రూ.104.32 గా ఉంది.
బ్రెజిల్ అధ్యక్షుడిపై నేర అభియోగాలు
ప్రశ్నించినందుకు దాడిచేసిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్
ఉత్తరాఖండ్పై ప్రకృతి ప్రకోపం.. 47కు పెరిగిన మృతులు
తెలంగాణ దళితబంధుకు ఈసీ బ్రేకులు