దర్వాజ-క్రీడలు
T20 worldcup 2021: దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2021లో వెస్టిండీస్పై 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. 56 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు.. 8.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసి విజయం సాధించింది. జోస్ బట్లర్ 24 పరుగులతో రాణించాడు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 14.2 ఓవర్లలో 55 పరుగులకు ఆలౌట్ అయింది. విండీస్ ఆటగాళ్లలో క్రిస్ గేల్ మినహా మిగతా పది మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ ధాటికి విండీస్ జట్టు విలవిల కొట్టుకుంది. 2.2 ఓవర్లు వేసిన రషీద్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
T20 World Cup: విండీస్ చెత్త రికార్డు..
T20 World Cup: ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా బోణీ..
పెట్రోల్ పన్నులతోనే.. ఫ్రీ వ్యాక్సిన్లు.. :కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్పూరీ
బ్రెజిల్ అధ్యక్షుడిపై నేర అభియోగాలు