దర్వాజ-హైదరాబాద్
Hyderabad Crime :కూర్చుని మాట్లాడుకుంటే తీరిపోయే చిన్న సమస్యకు తీవ్ర కోపానికి లోనై కూరగాయలు కోసె కత్తితోనే తన భర్త ప్రాణాలు తీసిందో భార్య. ఈ ఘటన హైదరాబాద్ లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం నాడు చోటుచేసుకుంది. ఇన్ స్పెక్టర్ సీతారం చెప్పిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా బుసిరెడ్డి గ్రామానికి చెందిన బుసిరెడ్డి మురళీధర్ రెడ్డి(42), మౌనిక(25) లకు 9 ఏండ్ల కొడుకు ఉన్నాడు.
వీరు 11 ఏండ్ల కిందటే సరూర్ నగర్ కు వలసొచ్చి నివసిస్తున్నారు. ఈ దంపతులు వేరు వేరు కంపెనీల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకంటూ జీవిస్తున్నారు. అయితే మౌనిక డిగ్రీ పరీక్షలు రాసేందుకు ఈ నెల 5 న గుంటూరుకు వెళ్లింది. ఆ మరునాడే ఆమె ఇంటికి వచ్చింది. అయితే ఆమె ఇంట్లో లేని సమయంలో తండ్రి మురళీధర్ రెడ్డి ఆమెపై చెడుగా ప్రచారం చేశాడంటూ కొడుకు మౌనికకు చెప్పాడు.
దాంతో ఆమె తీవ్రమైన కోపానికి గురై భర్తతో వాగ్వాదానికి దిగింది. దీంతో ఆ దంపతుల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. ఈ క్రమంలోనే మౌనిక విచక్షణ కోల్పోయి క్షణికావేశంతో కూరగాయలు కట్ చేసే కత్తితో భర్త మెడపై పొడిచించి.. దాంతో మురళీధర్ రెడ్డి ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత ఆమె స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో లొంగి పోయింది.
వామ్మో నిద్ర పోకపోతే ఇంత పెద్ద సమస్యా?
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న విడుదల
పోషకాహార లోపంలో 33 లక్షల మంది చిన్నారులు
సెలవు దక్కలేదనే కోపంతో కాల్పులు.. నలుగురు జవాన్లు మృతి
Chapped Lips Tips:చలికి పెదవులు పగులుతున్నాయా? అయితే ఈ టిప్స్ మీ కోసమే..
Gold Price:మళ్లీ పెరిగిన బంగారం ధరలు
27 శాతం పెరిగిన వ్యాపారుల ఆత్మహత్యలు