దర్వాజ-భోపాల్
MP CM Shivraj Chouhan: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవులు పేడ, మూత్రంతో వ్యక్తుల ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను సైతం బలోపేతం చేస్తాయని చౌహాన్ అన్నారు. తాజాగా ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ నిర్వహించిన మహిళా పశువైద్యుల సదస్సు ‘శక్తి 2021’లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఆవుల పేడ, మూత్రంతో దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తాయి. దీనికోసం సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మధ్యప్రదేశ్ శ్మశాన వాటికల్లో కలప వినియోగాన్ని తగ్గించేందుకు ఆవుల పేడతో చేసిన దుంగలు ఉపయోగిస్తున్నారు’’ అని అన్నారు. అలాగే, చిన్న రైతులు, పశువుల యజమానులకు ఆవుల పెంపకం లాభదాయకమైన వ్యాపారంగా ఎలా మారుతుందనే దానిపై వెటర్నరీ వైద్యులు, నిపుణులు పరిశోధనలు సాగించాలని సూచించారు.
Samantha : ‘పుష్ప’ స్పెషల్ సాంగ్లో సమంత చిందులు !
2 లక్షల జీతం కానీ.. 30 వేలకు కక్కుర్తిపడి.. చివరకు..?
Madras High Cour: ప్రజా ప్రయోజనం కోసమా? మెరుగైన న్యాయ నిర్వహణ కోసమా?
Terrorist Attack : మణిపూర్లో భద్రతా కాన్వాయ్ పై ఉగ్రదాడి
Night Time Eating: అర్థరాత్రి తినే అలవాటు మీకుందా? అయితే ఈ ఫుడ్ మాత్రమే తీసుకోండి..
Crime: ఎంతటి అమానుషం.. సంతానం కోసం 16 నెలలుగా యువతిని బంధించి..