• 13 నెలల పోరాటానికి వచ్చిన విజయం
• రైతులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలె
• రైతు ఉద్యమ మృతుల కుటుంబాలను కేంద్రం ఆదుకోవాల్సిందే
• రాష్ట్ర ప్రభుత్వం తరుఫున చనిపోయిన రైతు కుటుంబానికి రూ. 3 లక్షల సాయం
• కేంద్ర ఆ కుటుంబాలకు రూ. 25 లక్షల సాయం చేయాలె
• కొత్త సాగు చట్టాల రద్దు.. భారత రైతాంగం సాధించిన విజయం
• తెలంగాణ సీఎం కేసీఆర్
దర్వాజ-హైదరాబాద్
CM KCR: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంలో ఎంతో మంది రైతుల పోరాటం ఉందని.. ఈ విజయం భారత రైతాంగానిదేనని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో శనివారం సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. గత 13 నెలల నుంచి రైతులు పడుతున్న ఎన్నో ఇబ్బందులకు నేటితో ముగింపు వచ్చందని తెలిపారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమంలో ఎంతో మంది రైతులపై కేంద్రం దేశద్రోహం లాంటి కేసులు కూడా పెట్టిందని తెలిపారు. వెంటనే రైతుల మీద పెట్టిన అన్ని కేసులను కేంద్రం ప్రభుత్వం ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు.
అలాగే కర్ణాటకలోని ఒక అమ్మాయి రైతులకు సంఘీభావంగా ఒక ట్వీట్ చేస్తే ఆమెపై కూడా కేసు పెట్టారని గుర్తుచేశారు. తక్షణమే అలాంటి కేసులన్నింటినీ ఎత్తేయాలి తెలిపారు. మళ్లీ ఎప్పుడూ కూడా రైతులను వేధించకూడదని కోరారు.
కేంద్రం చేసిన పనివల్లే..
దుర్మార్గంగా కేంద్రం వ్యవహరించడం వలనే 750 మంది వరకు రైతులు ఆత్మార్పణం చేసుకున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. వాళ్ల కుటుంబాలు రోడ్డున పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి అమరుల కుటుంబాలకు సాయం..
తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా చనిపోయిన రైతుల ప్రతి కుటుంబానికి 3 లక్షల సాయం అందించనున్నట్లు సీఎం తెలిపారు. దాని కోసం రూ..22.5 కోట్లు ఖర్చు అవనున్నట్లు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యతగా అమరులైన రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల సాయం అందించాలని డిమాండ్ చేశారు.
కనీస మద్దతు ధర చట్టం కావాల్సిందే..
దేశ రైతాంగానికి భరోస కలిపించేందుకు కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలని సీఎం డిమాండ్ చేశారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై పోరుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Masala: గరం మసాలాలను తింటే ఆ రోగాలు రావా?
CM KCR: రేపే ఢిల్లీకి.. తాడో పేడో తేల్చుకుంటాం
Shrutihaasan: ఆ సీన్స్ లేకుంటేనే సీనియర్ హీరోలతో నటిస్తానంటున్న శృతిహాసన్
‘మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా’
AP Floods: 12 మంది మృతి.. పదుల సంఖ్యలో గల్లంతు
AP Rains: రాయలసీమను ముంచెత్తిన వరదలు
PM Modi: కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తాం: ప్రధాని మోడీ
బాయిల్డ్ రైస్ కొనం.. : కేంద్రం
EY-Refyne Survey : నెల కాకముందే జీతం ఖతం..