చల్లగాలి కోసం కారులోంచి తల బయటకు పెట్టింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
దర్వాజ-క్రైమ్
Crime :చల్లగాలి కోసమని కారు విండోలోంచి తల బయటపెడితే విద్యుత్ స్తంభం తగిలి ఓ యువతి ప్రాణాలు విడిచిన ఘటన శనివారం తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. ఆ యువతి స్నేహితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
మారెడుమిల్లి విహార యాత్రకని 8 మంది స్నేహితులు పశ్చిమ గోదావరి జిల్లా గౌరిపట్నం నుంచి ఒక కారులో బయలుదేరారు. వీరి కారు మధురపూడి విమానాశ్రయం గేటు బూరుగుపూడి గ్రామం మధ్యన వెలుతున్న సమయంలో లోహిత్ రాణి అనే యువతి చల్లగాలి కోసమని కారు విండోలోంచి తల బయటకు పెట్టింది.
అదే సమయంలో ఆ కారు రోడ్డు అంచు దిగింది.. దాందో ఆమె తల పక్కనే ఉన్న స్తంభానికి గట్టిగా తగిలింది. దాంతో హుటాహుటిన ఆ యువతిని అదే కారులో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. కానీ అప్పటికే ఆ యువతి మరణించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Bigg Boss: బిగ్ బాస్ లీక్.. ఇంటి నుంచి ఈ వారం ఔట్ అయ్యేది..?
Gold: బంగారం కొనే వారికో గుడ్ న్యూస్..
ఆ పాట వింటే ‘రాధేశ్యామ్’స్టోరీ మొత్తం తెలిసిపోతుందట..
Papagni River: కూలిన పాపాగ్ని నది వంతెన.. నెల రోజులపాటు రాకపోకలు బంద్
Healthcare: పడకేసిన పట్టణారోగ్య వ్యవస్థ
కనీస మద్దతు ధర చట్టం తేవాల్సిందే..
Masala: గరం మసాలాలను తింటే ఆ రోగాలు రావా?
CM KCR: రేపే ఢిల్లీకి.. తాడో పేడో తేల్చుకుంటాం
Share this content: