దర్వాజ-న్యూఢిల్లీ
indian citizenship: గత ఐదేండ్లలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ దిగ్భ్రాంతికరమైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు పార్లమెంట్లో ప్రకటించింది. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ పై వివరాలు వెల్లడిరచింది. కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్సభకు వెల్లడించిన వివరాల ప్రకారం.. విదేశాల్లో 1,33,83,718 మంది భారతీయులు నివసిస్తున్నారు. అయితే, 2017లో 1,33,049 మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇక 2018లో 1,34,561 మంది, 2019లో 1,44,017 మంది, 2020లో 85,248 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ ఏడాదిలో (2021) సెప్టెంబర్ 30,వరకు 1,11,287 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. మొత్తంగా ఐదేండ్లలో 6 లక్షల మందికి పైగా భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇదే సమయంలో కొత్తగా 4,177 మందికి భారత పౌరసత్వం ఇచ్చినట్టు మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు.
ఏమయ్యా రణ్ బీర్.. లెహంగ పొడవుగా ఉంటే అలా చేయాలా.. అయినా నీకెందుకంత పొగరు .?
ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?
వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?
Omicron: ఒమిక్రాన్.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి
చర్చ లేకుండానే.. సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్సభ ఆమోదం
MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్
ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?
సెల్ ఫోన్ను నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నారా? డౌటే లేదు మీకు ఆ జబ్బులు వచ్చినట్టే..