Breaking
Sun. Jun 29th, 2025

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

rosaiah
rosaiah

దర్వాజ-తెలంగాణ&ఆంధ్రప్రదేశ్
Konijeti Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోశయ్య(88)కు శనివారం అకస్మత్తుగా బీపీ తగ్గి పల్స్ పడిపోవడం జరిగాయి. దాంతో ఆయనను బంజారహిల్స్ లోని ఓ ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించారని డాక్టర్లు వెళ్లడించారు. ఇక రోశయ్య భౌతిక కాయాన్ని అమీర్ పేటలో ఉన్న తన నివాసానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. రేపు ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశముంది.

Konijeti-Rosaiah-1 మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

రోశయ్య సీఎం గా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా కూడా ప్రజలకు అనేక సేవలందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత రోశయ్య ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక సేవలందించారు. ఆ తర్వాత గవర్నర్ గా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సేవ చేశారు. అలాగే 7 సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టి సరికొత్త గుర్తింపును తెచ్చుకున్నారు. 1968, 1974,1980 సంవత్సరాలల్లో కాంగ్రెస్ తరఫున శాసన సభ సభ్యుడిగా రోశయ్య ఎన్నికయ్యారు. అలాగే శాసన మండలి సభ్యుడిగా 2009 లో పోటీ చెయ్యకుండానే ఎన్నికయ్యారు.

సుదీర్ఘకాలం పాటు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో పనిచేశారు రోశయ్య. ఇక పోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో రోశయ్య 3 సెప్టెంబర్ 2009 నుండి 2010 నవంబర్ 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత ఈయన తమిళనాడు గవర్నర్ గా 2011 ఆగస్టు 31నుండి 2016 ఆగస్టు 30 వరకు సేవలందించారు. మొదటి సారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోశయ్య రవాణా శాఖ, రోడ్డు రహదార్ల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. స్వాతంత్ర్య సమయోధుడు, సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రోశయ్య మరణం అందరినీ కలచివేస్తోంది.

స్టైలిష్ వేర్ లో నోరెళ్ల బెట్టిస్తున్న సమంత.. మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే..

మీకిది తెలుసా.. నేటి నుంచే వీటి ధరల మరింత ఖరీదు కానున్నాయి..

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

https://darvaaja.com/tamannaah/

Related Post