• కేంద్రానికి లేఖ రాయనున్నట్టు నాగాలాండ్ సర్కారు వెల్లడి
• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్హెచ్చార్సీ నోటీసులు
దర్వాజ-న్యూఢిల్లీ
Nagaland AFSPA: ఈశాన్య భారతం మరోసారి ఉద్రిక్తంగా మారింది. నాగాలాండ్లోని మోన్ జిల్లాలో మిలిటెంట్లుగా భావించి భద్రతా బలగాలు సాధారణ పౌరులపై కాల్పులు జరిపిన ఘటనలో 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగాలాండ్తో పాటు ఈశాన్య భారత రాష్ట్రాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఘటనను ఖండిస్తూ నాగాలాండ్ సహా సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలు ఆందోళనకు దిగారు. పలు చోట్ల కొవ్వొత్తులతో శాంతియుత నిరసనలు ర్యాలీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం AFSPA ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖ రాయలని నాగాలాండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భద్రతా బలగాల కాల్పుల్లో 14 మంది పౌరులు మరణించిన అనంతం ఏర్పడిన పరిస్థితులపై చర్చించడానికి నాగాలాండ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశమైన క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంది.
AFSPA రద్దు చేయాలంటూ..
ఇదిలావుండగా, ఈశాన్య రాష్ట్రాల్లో మిలిటెంట్ల కార్యకలాపాను నిరోధించడానికి భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాలు కల్పించే చట్టం ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ (AFSPA). ఈ చట్టం అక్కడి సైన్యానికి విస్తృత అధికారాలు కల్పిస్తుంది. ఇది దుర్వినియోగం అవుతున్నదనీ, దీని కారణంగా చాలా సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బందులు పడటంతో పాటు అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు, వివాదాలు ఉన్నాయి. ఈ చట్టాన్ని రద్దు చేయాలాని కొన్నేండ్లుగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం చోటుచేసుకున్న మోన్ జిల్లా ఘటనతో మళ్లీ తెరపైకి వచ్చింది.

హార్న్బిల్ ఫెస్టివల్ను రద్దు
AFSPAను ఉపయోగించుకుని ఈశన్య భారతంలో ప్రజలను భద్రతా బలగాలు అణచివేస్తున్నాయనీ, అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయనీ, దినిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నాడు నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో. మేఘాలయ సీఎం సంగ్మాలు AFSPA చట్టాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ మిత్రపక్షాలతో పాటు విపక్షాలు పార్లమెంట్లో డిమాండ్ను లేవనెత్తాయి. నాగాలాండ్ ఈ అంశం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో హార్న్బిల్ ఫెస్టివల్ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నదని పీటీఐ నివేదించింది.
ఆరు వారాల్లో నివేదిక ఇవ్వండి: ఎన్హెచ్చార్సీ
నాగాలాండ్లో జరిగిన పౌరులపై కాల్పుల ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. మోన్ జిల్లా ఘటనపై ఆరు వారాల్లోగా సమగ్ర నివేదికను తమకు సమర్పించాలని కేంద్ర రక్షణ కార్యదర్శి, కేంద్ర హోం కార్యదర్శి, నాగాలాండ్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లను మానవ హక్కుల సంఘం ఆదేశించింది.
Also Read:
కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు
ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్
బీజేపీలో చేరేందుకు సిద్దమైన తీర్మాన్ మల్లన్న.. ఎప్పుడంటే?
అందరికి ఉన్నవే నాకు ఉన్నయ్.. హాట్ ఫోటో షూట్ పై పాయల్ ఘాటు సమాధానం..
భార్యను చంపనీకే ఏకంగా క్షుద్రపూజలే చేసాడు.. ఆఖరికి ఏమైందంటే..?
బాబోయ్.. ప్రియాంక అంత రెమ్యూనరేషన్ తీసుకుందా..
పెళ్లంటే సులువు కాదురా.. అంటున్న పూజా హెగ్డే