దర్వాజ-నేషనల్
Gold Price Today: కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వచ్చాయి. రోజుల వ్యవధిలోనే హెచ్చుతగ్గులు ఉండే పసిడి ధర ఈ రోజు స్వల్పంగా పెరిగింది. అలాగే వెండి ధరలు కూడా ఇదే బాటలోనే వెళ్లాయి. ఈ రోజు బంగారం ధర నిన్నటితో పోల్చితో సుమారుగా 10 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం వివిధ నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ లో.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 49,220 ధర పలుకుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,120 గా ఉంది.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ , విశాఖపట్టణంలో కూడా పసిడి ఇవే ధరల వద్ద స్థిరంగా ఉంది. ఢిల్లీలో అయితే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 51,560 గా ఉంటే.. 22 క్యారెట్ల పసిడి రూ. 47,260 గా కొనసాగుతోంది. అదే ముంబై లో అయితే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,780 గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,780 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
ఇకపోతే చెన్నైలో అయితే 24 క్యారెట్ల బంగారం ధర వద్ద రూ.110 తగ్గి రూ.49,400 గా ఉంటే.. అదే 24 క్యారెట్ల వద్ద 100 రూపాయలు తగ్గి రూ.45,290 గా పలుకుతోంది. ఇక వెండి విషయానికొస్తే.. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.65,300 లుగా ఉంది. విశాఖ, విజయవాడలో కూడా ఇదే ధర పలుకుతుంది. ఇకపోతే చెన్నైలో కిలో వెండి రూ. 46,780 గా ఉంటే.. బెంగుళూరులో రూ. 61,400 గా, ముంబైలో ధర రూ. 61,400 గా ఉంది.
సమంత ఐటం సాంగ్ పై కేసు పెట్టిన పురుషుల సంఘం.. ఎందుకంటే..?
మిస్ యూనివర్స్ గా భారతీయ యువతి
బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..
Bipin Rawat: త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ .. ఓ యుద్ధవీరుడు
AFSPA రద్దు చేయండి.. ఈశాన్య భారతంలో నిరసనలు
కెవ్వు కేక అనిపిస్తున్న జాన్వీ కపూర్ అందాలు
ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్