Breaking
Mon. Jun 30th, 2025

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు

అగ్నిప్ర‌మాదం, హైద‌రాబాద్, నాంప‌ల్లి అగ్నిప్ర‌మాదం, హైద‌రాబాద్ అగ్నిప్ర‌మాదం, తెలంగాణ‌, Fire accident, Hyderabad, Nampally fire Accident, Hyderabad fire, Telangana,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్‌
Telangana: ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బ్రిడ్జి నిర్మాణంలో నిమగ్నమైన ఆరు వాహనాలకు నిప్పుపెట్టారు. దీనికి పాల్ప‌డిన వారిని మావోయిస్టులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుందని, స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం అందించారనీ, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. స్థానికుల ప్రకారం.. వంతెన నిర్మాణ పనుల కోసం ఉద్దేశించిన కనీసం ఆరు వాహనాలను సాయుధ మావోయిస్టులు, మిలీషియా సభ్యులు సాయంత్రం 4.30 గంటలకు తగులబెట్టారు. వారు వారి మూడు ట్రాక్టర్లను కూడా తీసుకువెళ్లారు. అలాగే, వారి సెల్ ఫోన్లను లాక్కున్నార‌ని అధికారులు తెలిపారని పీటీఐ నివేదించింది.

Related Post