దర్వాజ-హైదరాబాద్
Petrol, Diesel Prices Hiked: గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం చమురు ధరలు దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. పెరుగుతు పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులు నడ్డివిరుస్తున్నాయి. సమాన్యులపై సైతం ప్రభావం చూపుతున్నాయి. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను ఈ రోజు కూడా పెంచాయి. పెట్రోలు-డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు చొప్పున మళ్లీ పెరిగాయి. గత రెండు వారాల్లో పెట్రోల్, డీజిల్ పై మొత్తం లీటరుకు ₹ 9.20కి పెరిగాయి. గత రెండు వారాల్లో 13వ సారి చమురు ధరలు పెరిగాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు ₹ 104.61 గా ఉంది. డీజిల్ ధరలు లీటరుకు ₹ 95.87 కు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.120కి పైగానే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణలో పెట్రోల్పై 91పైసలు, డీజిల్పై 87 పైసలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం రాజధాని హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.118.59, లీటర్ డీజిల్ ధర రూ.104.62కు చేరుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో లీటర్ పెట్రోల్పై 88పైసలు, డీజిల్పై 84పైసలు పెరిగాయి. దీంతో గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.120.38, డీజిల్ ధర రూ.106.04కు పెరిగింది.