దర్వాజ-హైదరాబాద్
Petrol, Diesel Prices Hiked: గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం చమురు ధరలు దేశంలో రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. పెరుగుతు పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులు నడ్డివిరుస్తున్నాయి. సమాన్యులపై సైతం ప్రభావం చూపుతున్నాయి. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను ఈ రోజు కూడా పెంచాయి. పెట్రోలు-డీజిల్ ధరలు లీటరుకు వరుసగా, 84, 85 పైసలు చొప్పున మళ్లీ పెరిగాయి. గత రెండు వారాల్లో పెట్రోల్, డీజిల్ పై మొత్తం లీటరుకు ₹ 10 పెరిగాయి. 16 రోజుల్లో 14వ సారి చమురు ధరలు పెరిగాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు ₹ 105.41 గా ఉంది. డీజిల్ ధరలు లీటరుకు ₹ 96.67 కు పెరిగింది.
రాష్ట్ర ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం ఢిల్లీలో డీజిల్ ధరలు లీటరుకు రూ. 95.87 నుండి రూ. 96.677కి పెరిగాయి. దేశవ్యాప్తంగా రేట్లు పెంచబడ్డాయి మరియు స్థానిక పన్నుల సంభవనీయతను బట్టి రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. మార్చి 22న రేట్ల సవరణలో నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం ముగిసిన తర్వాత ధరలు పెరగడం ఇది 14వది.
దేశంలోని నాలుగు మహానగరాల్లోనూ పెట్రోలు, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..
ఢిల్లీ – లీటర్ పెట్రోల్ రూ.105.41, డీజిల్ రూ.96.677
ముంబై – లీటర్ పెట్రోల్ రూ.120.51, డీజిల్ రూ.104.77
చెన్నై – లీటర్ పెట్రోల్ రూ.110.83, డీజిల్ రూ.100.92
కోల్కతా – లీటర్ పెట్రోల్ రూ.115.10, డీజిల్ రూ.99.81
నగరాల వారీగా ఇంధన ధరలు
బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.111.07, డీజిల్ రూ.94.78కి చేరింది.
లక్నోలో లీటర్ పెట్రోల్ రూ.105.23, డీజిల్ రూ.96.81కి చేరింది.
జైపూర్లో లీటర్ పెట్రోల్ రూ.118.01, డీజిల్ రూ.100.91కి చేరింది.
పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.116.21, డీజిల్ రూ.101.04గా ఉంది.
అహ్మదాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.105.27, డీజిల్ రూ.99.62గా ఉంది.
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.119.47, డీజిల్ రూ.105.47గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు పైపైకి..
రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తెలంగాణలోచమురు ధరలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం రాజధాని హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49, లీటర్ డీజిల్ ధర రూ.105.49కు చేరుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ ధర చిత్తూరులో రూ.122.39 గా ఉంది. డీజిల్ ధర రూ.107.83కు పెరిగింది.