Breaking
Sat. Jun 28th, 2025

Telangana | కేంద్రానికి వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు..

Telangana: TRS protests against the central government in Devunipadakal
Telangana: TRS protests against the central government in Devunipadakal

ద‌ర్వాజ‌-రంగారెడ్డి

Telangana: రాష్ట్రంలో పండే వరి ధాన్యాన్ని కొనుగోలు అంశంపై భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నాయి. రాష్ట్రంలో పండిస్తున్న ధాన్యాన్ని చివ‌రిగింజ వ‌ర‌కు కొనుగోలు చేసేంత వ‌ర‌కు పోరాటం సాగిస్తామ‌ని టీఆర్ఎస్ నేత‌లు పేర్కొంటున్నారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలు గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘రైతు మహా ధర్నా’ నిరసనలు చేపట్టారు. శుక్ర‌వారం కూడా రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో నిర‌స‌న‌లు నిర్వ‌హించారు.
ఈ క్ర‌మంలోనే రంగారెడ్డి జిల్లా త‌ల‌కొ్ండల్లి మండ‌ల టీఆర్ఎస్ శ్రేణులు కేంద్ర ప్ర‌భుత్వ తీరును ఖండిస్తూ.. నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాయి. ప్ర‌ధాని మోడీ, బీజేపీకి వ్య‌తిరేకంగా నిన‌దించాయి. దేవుని ప‌డ‌క‌ల్ గ్రామంలో నిర్వ‌హించిన నిర‌స‌నల్లో టీఆర్ఎస్ మండ‌ల అధ్య‌క్షులు ఉమ్మ‌రి శంక‌ర్, ఉప స‌ర్పంచ్ రాజ‌మోని తిరుప‌తి, గ్రామ అధ్య‌క్షులు ఏ.ర‌మేష్‌, ఆర్. స్వామి గౌడ్‌, విద్యాక‌మిటి అధ్యక్షులు ఏ.ల‌క్ష్మయ్య‌, మ‌ద్దూరి స‌త్యం, ఏ.లింగ‌య్య‌, వార్డు మెంబ‌ర్లు ఏ.నర్సింహ్మ‌, ఏ.వెంక‌టేష్‌, జాల జంగ‌య్య‌, పీ.ఆంజ‌నేయులు, పీ.వెంక‌ట‌య్య‌, కే.చిరంజీవి, ఏడ్ల రాజు, పీ.శ్రీను, పీ.శివుడు, కే.న‌ర్సింహ్మ‌, ఆర్‌.బాలు, కే.అంజ‌య్య‌, కృష్ణయ్య‌, మండ‌లానికి చెందిన రైతులు పాల్గొన్నారు.

Related Post