దర్వాజ-హైదరాబాద్
Dharmapuri Arvind: భారతీయ జనతా పార్టీ నాయకుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. గ్రూప్-1 పరీక్షలు ఉర్దూలో రాయడానికి అనుమతించడంపై ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రూప్ 1 పోస్టులకు ఉర్దూ భాషలో పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తన ఓటు బ్యాంకు కోసం మైనారిటీ వర్గాన్నిఇలా ప్రలోభాలకు గురిచేస్తున్నారని విమర్శించారు.
ఎంపీ ధర్మపురి అరవింద్ వీడియాతో మాట్లాడుతూ.. ఇది ముస్లింలను మభ్యపెట్టడం ఉద్దేశం. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రాసిన గ్రూప్-1 పరీక్షను హిందువులు, ముస్లింలు లేదా క్రైస్తవులు ఎవరైనా సరిచేయవచ్చు. ఉర్దూలో రాసిన పరీక్షను ముస్లిం మాత్రమే సరిదిద్దగలరు” అని అన్నారు.ఇది ఆయా వర్గాల వారికి అనుకూలించే అంశమని తెలిపారు. అభ్యర్థి, మూల్యాంకనం చేసేవారు ఇద్దరూ ఒకే వర్గానికి చెందిన వారు కావడంతో ఇటువంటి చర్య అనుకూలతను ప్రోత్సహిస్తుందని.. ఇది పారదర్శకతను దెబ్బతీస్తుందని ఎంపీ అన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా తహసీల్దార్లు, డిప్యుటీ కలెక్టర్లు ఇతర గ్రూప్వన్ఉద్యోగాలన్నీ ముస్లింలకే వస్తాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముస్లింలకు అప్పగిస్తోందని, ఇది రజాకార్ల పాలన కాదా అని ప్రశ్నించారు.