Breaking
Sat. Jun 28th, 2025

Srinagar Terror Attack: శ్రీనగర్ లో ఉగ్రదాడి… !

india army

దర్వాజ-న్యూఢిల్లీ

Jammu and Kashmir terror attack: జ‌మ్మూకాశ్మీర్ లో మ‌రోసారి ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. శనివారం ఉదయం శ్రీనగర్‌లోని ఐవా బ్రిడ్జి వద్ద ఉగ్రవాదులు కాల్పులు తెగ‌బ‌డ్డారు. ఈ దాడిలో ప‌లువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఒక‌రి ప‌రిస్థితి ఆందోళ‌క‌రంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. “శ‌నివారం ఉదయం 8:40 గంటలకు, శ్రీన‌గ‌ర్ లోని సఫకదల్ ప్రాంతంలోని ఐవా బ్రిడ్జి సమీపంలో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ పోలీసుల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో కానిస్టేబుల్ గులాం హసన్‌పై కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు” అని ఓ పోలీసు ఉన్న‌తాధికారి వెల్ల‌డించారు.

భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని.. ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉగ్ర‌వాదుల జాడ‌కోసం గాలిస్తున్నాయి. అంత‌కు ముందురోజు.. జమ్మూ & కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో వార్షిక అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే మార్గంలో హిజ్బుల్ ముజాహిదీన్ అగ్ర కమాండర్ అష్రఫ్ మోల్వి మరియు అతని ఇద్దరు సహచరులు కాల్చి చంపబడిన ఒక రోజు తర్వాత భద్రతా సిబ్బందిపై దాడి జరగ‌డం గ‌మ‌నార్హం.

Related Post